యాప్నగరం

5 రూపాయల షేర్‌కు రూ.974 లాభం.. భారీ డివిడెండ్ ప్రకటించిన సాఫ్ట్‌వేర్ కంపెనీ

బీమా కంపెనీలకు సాఫ్ట్‌వేర్ విక్రయించే ఓ సంస్థ తమ షేర్‌హోల్డర్లకు నమ్మశక్యం కాని రీతిలో 19480 శాతం డివిడెండ్ ప్రకటించింది.

Samayam Telugu 16 Dec 2020, 8:16 am
కరోనా వేళ కంపెనీలన్నీ తీవ్ర ఆర్థిక సమస్యలతో సతమతం అవుతుంటే.. ఇన్సూరెన్స్ టెక్నాలజీ సంస్థ మెజెస్కో లిమిటెడ్ మాత్రం.. షేర్ హోల్డర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. రూ.5 విలువైన షేర్‌కు రూ.974 మధ్యంతర డివిడెండ్ (లాభాల్లో వాటా) ప్రకటించింది. ఇది 19480 శాతం కావడం గమనార్హం. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ ఇంటీరిమ్ డివిడెండ్‌కు డిసెంబర్ 15 నిర్వహించిన బోర్డు మీటింగ్‌లో ఆమోదం తెలిపారు.
Samayam Telugu dividend


మెజస్కో లిమిటెడ్ సంస్థ మన దేశంలోని ఇన్సూరెన్స్ సంస్థలకు సాఫ్ట్‌వేర్‌‌ను విక్రయించడంతోపాటు కన్సల్టింగ్ అండ్ సర్వీసెస్‌ను అందిస్తుంది. ఈ సంస్థ షేర్‌హోల్డర్లకు రూ.2788.4 కోట్ల ఇంటీరిమ్ డివిడెండ్‌ను ప్రకటించింది. మిగతా రూ.103 కోట్ల నగదును బోర్డు, రెగ్యులటరీ అనుమతుల మేరకు పంపిణీ చేయనున్నారు.

షేర్ హోల్డర్లకు ఈ స్థాయిలో మధ్యంతర డివిడెండ్ ప్రకటించగానే ఆ సంస్థ షేర్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు కంటే ఎక్కువ పెరిగాయి. సెప్టెంబర్ 30తో ముగిసిన రెండో త్రైమాసికంలో కంపెనీ 113.9 శాతం వృద్ధి నమోదు చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ రూ.30 కోట్లుగా నమోదైంది.

కంపెనీకి భారీగా ఆదాయం సమకూర్చే అమెరికా విభాగాన్ని విక్రయించనున్నట్లు జులైలో మెజస్కో ప్రకటించింది. షేర్‌కు రూ.845 చొప్పున తన ఈక్విటీలో 25 శాతం బై బ్యాక్‌ను ప్రకటించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.