యాప్నగరం

ఏటీఎం నుంచి రూ.100 నోట్లకు బదులు రూ.500 నోట్లు.. క్యూ కట్టిన జనం!

ఏటీఎంలో రూ.100 కొడితే రూ.500 వచ్చింది. దీంతో జనాలు క్యూ కట్టారు. రూ.5 లక్షలకు పైగా విత్‌డ్రా చేసేశారు. అయితే పోలీసులు అక్కడకు రావడంతో ఏటీఎంకు తాళం పడింది. డబ్బుల రికవరీ మొదలుపెట్టారు.

Samayam Telugu 16 May 2021, 2:33 pm

ప్రధానాంశాలు:

  • ఏటీఎంలో రూ.100కు రూ.500
  • క్యూ కట్టిన జనం
  • ఆ తప్పు వల్ల ఇలా జరిగింది

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu atm
జేబులో డబ్బులు అయిపోయాయా? ఇంట్లో క్యాష్ లేదా? అయితే ఎవరైనాసరే ఏటీఎంకు వెళ్లి డబ్బులు తీసుకుంటారు. ఏటీఎంలో క్యాష్ విత్‌డ్రా చేసేటప్పుడు ఎంత అమౌంట్ ఎంటర్ చేస్తే.. అంతే డబ్బులు వస్తాయి. అది కూడా మీ బ్యాంక్ ఖాతాలో సరిపడ డబ్బులు ఉన్నప్పుడే ఏటీఎం నుంచి క్యాష్ వస్తుంది.
ఈ విషయం అందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఒక విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఒక ఏటీఎంలో మాత్రం మీరు ఎంటర్ చేసిన డబ్బు కన్నా ఎక్కువ డబ్బులు వచ్చాయి. ఏకంగా ఏటీఎం నుంచి కావాల్సిన దాని కన్నా ఐదింతల ఎక్కువ డబ్బు వచ్చింది.

Also Read: undefined

వనపర్తి జిల్లా అమరచింతలో ఇండియా–1 ఏటీఎం ఉంది. శనివారం ఉదయం ఈ ఏటీఎం నుంచి రూ.100 విత్‌డ్రా చేస్తే రూ.500 వచ్చింది. ఈ విషయం ఒక్కక్కరిగా అందరికీ తెలిసిపోయింది. దీంతో జనాలు ఈ ఏటీఎం ముందు క్యూ కట్టారు.

అదేసమయంలో పెట్రోలింగ్‌కు వచ్చిన పోలీసులు అక్కడ గుంపులుగా ఉన్న జనానిచూసి ఆగారు. విషయం తెలుసుకొని అందరినీ అక్కడి నుంచి పంపించేశారు. ఏటీఎంకులాక్ వేసి నిర్వాహకులకు సమాచారం అందించారు. రూ.100 నోట్ల స్థానంలో రూ.500 నోట్లు పెట్టడం వల్ల ఇలా జరిగిందని తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.