యాప్నగరం

Farmers: రైతులకు కేంద్రం హెచ్చరిక.. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ అలర్ట్!

Pm Kusum Yojana Online Registration: రైతులకు అలర్ట్. మోసగాళ్లు ఫేక్ వెబ్‌సైట్లతో అన్నదాతలను మోసం చేస్తున్నారు. పీఎం కుసుమ్ స్కీమ్ కింద మోసాలకు పాల్పడుతున్నారు. ఈ స్కీమ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అందువల్ల రైతులు ఈ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి. వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే ఫేక్ మెసేజ్‌లకు స్పందించొద్దని కేంద్రం కోరుతోంది. అంతేకాకుండా ఈ స్కీమ్‌ రిజిస్ట్రేషన్ చార్జీలు అంటూ ఏమీ ఉండవని, ఎవరైనా చార్జీలు చెల్లించాలని అడిగితే.. నమ్మవద్దని సూచించింది.

Authored byKhalimastan | Samayam Telugu 28 May 2022, 8:48 am

ప్రధానాంశాలు:

  • అన్నదాతలకు ముఖ్యమైన అలర్ట్
  • పీఎం కుసుమ్ యోజన స్కీమ్‌తో జాగ్రత్త
  • ఫేక్ వెబ్‌సైట్లతో అప్రమత్తంగా ఉండాలంటూ సూచన
  • లేదంటే డబ్బులు పోగొట్టుకోవాల్సి రావొచ్చు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu farmers alert
రైతులకు అలర్ట్
Government Schemes: పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (ఎంఎన్ఆర్ఈ) తాజాగా రైతులను హెచ్చరించింది. ఫేక్ వెబ్‌సైట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని కోరింది. పీఎం కుసుమ్ యోజన పేరుతో మోసపూరిత వెబ్‌సైట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. అందువల్ల అలాంటి లింక్స్‌పై క్లిక్ చేయవద్దని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి కిసాన్ ఉర్జా సురక్ష అండ్ ఉత్తన్ మహభియాన్ (PM Kusum Scheme) స్కీమ్‌ను అమలు చేస్తోంది. ఈ పథకం కింద అర్హత కలిగిన అన్నదాతలకు (Farmers) సోలాప్ పంపుల ఏర్పాటుకు సబ్సిడీ అందిస్తోంది. అలాగే సోలార్ ఎనర్జీని అందిస్తోంది. అయితే కేంద్రం ఇటీవల కొన్ని ఫేక్ వెబ్‌సైట్లను గుర్తించింది. ఇవి రైతుల దగ్గరి నుంచి డబ్బులను వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం రైతులను అలర్ట్ చేస్తోంది. అలాంటి ఫేక్ వెబ్‌సైట్లతో జాగ్రత్తగా ఉండాలని కోరుతోంది. వాట్సాప్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా స్కీమ్‌లో రిజిస్టర్ చేసుకోమని ఫేక్ లింక్స్ వస్తే.. వాటిని క్లిక్ చేయవద్దని తెలియజేస్తోంది. కచ్చితంగా ఆ వివరాలను ఒకసారి వెరిఫై చేసుకోవాలని పేర్కొంది.
డబ్బులు డిపాజిట్ చేయొద్దు
కుసుమ్ యోజన పథకంలో చేరడానికి రిజిస్ట్రేషన్ చార్జీల రూపంలో ఎవ్వరికీ డబ్బులు డిపాజిట్ చేయవద్దని కేంద్రం కోరుతోంది. రైతులు ఈ విషయాన్ని గమనించాలని పేర్కొంటోంది. ఈ అంశానికి సంబంధించి కొన్ని ఫిర్యాదులు అందాయని, ఇప్పటికే అలాంటి సైట్లపై చర్యలు తీసుకున్నామని వెల్లడించింది. అందువల్ల ఎవరైనా మిమ్మల్ని కూడా రిజిస్ట్రేషన్ చార్జీల రూపంలో డబ్బులు డిపాజిట్ చేయాలని కోరితే అలా చేయవద్దు. కొన్ని మోసపూరిత వెబ్‌సైట్లు .ఓఆర్‌జీ, .ఇన్, .కామ్ డొమైన్ పేర్లతో ఉన్నాయని కేంద్ర తెలిపింది.

MNRE.gov.in వెబ్‌సైట్ ద్వారా పథకానికి సంబంధించిన వివరాలను పొందొచ్చని కేంద్రం తెలిపింది. అలాగే ఈ స్కీమ్‌ను రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సంబంధిత మంత్రిత్వ శాఖలు అమలు చేస్తున్నాయని పేర్కొంది. లేదంటే 1800 180 3333 నెంబర్‌కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. మోసపూరిత వెబ్‌సైట్లతో మాత్రం జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం కోరుతోంది. www.kusumyojanaonline.in.net, www.pmkisankusumyojana.co.in, www.onlinekusumyojana.org.in వంటి ఫేక్ వెబ్‌సైట్లతో జాగ్రత్తగా ఉండాలని కేంద్రం తెలిపింది. వీటితో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టత ఇచ్చింది. అందువల్ల రైతులు ఇలాంటి వెబ్‌సైట్ల లింక్‌లపై క్లిక్ చేయవద్దని కోరింది. కాగా మరోవైపు రైతులకు పీఎం కిసాన్ స్కీమ్ 11వ విడత డబ్బులు ఈ నెల చివరిలో బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

Also Read: undefined

Also Read: undefined

20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.