యాప్నగరం

ర‌క్ష‌ణాత్మ‌క ధోర‌ణులు వ‌ద్దు

ఆర్థిక సరళీకరణ, వాణిజ్యం, పెట్టుబడుల సరళీకరణ పట్ల తమ నిబద్ధతను పునరుద్ఘాటించడం ద్వారా చైనా, జపాన్‌, దక్షిణ కొరియాలు అంతర్జాతీయ వాణిజ్య పురోగతి పట్ల తాజా విశ్వాసాన్ని ఏర్పరచాయి.

Samayam Telugu 11 May 2018, 12:06 pm
ఆర్థిక సరళీకరణ, వాణిజ్యం, పెట్టుబడుల సరళీకరణ పట్ల తమ నిబద్ధతను పునరుద్ఘాటించడం ద్వారా చైనా, జపాన్‌, దక్షిణ కొరియాలు అంతర్జాతీయ వాణిజ్య పురోగతి పట్ల తాజా విశ్వాసాన్ని ఏర్పరచాయి. టోక్యోలో జరుగుతున్న త్రైపాక్షిక సమావేశంలో చైనా ప్రధాని లీ కెకియాంగ్‌, జపాన్‌ ప్రధాని షింజో అబె, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌లు ఈ మేరకు ప్రతిన చేశారు.
Samayam Telugu protectionism
రక్షణవాదం

ర‌క్ష‌ణ‌వాదంపై గ‌ళ‌మెత్తిన దేశాధినేతలు


ప్రపంచవ్యాప్తంగా రక్షణవాదం పెరిగిపోతున్న తరుణంలో దానికి వ్యతిరేకంగా స్వేచ్ఛా వాణిజ్యానికి పెద్ద ఊపును, ఉత్సాహాన్ని ఇచ్చేలా వీరు ప్రతిన చేశారు. ఉమ్మడి ప్రయోజనాలను మరింత విస్తరించుకునేందుకు, వివాదాలను పరిష్కరించుకునేందుకు క్రమం తప్పకుండా సమావేశమవుతూ వుండాలని మూడు దేశాల నేతలు నిర్ణయించారు. చైనా, జపాన్‌, దక్షిణ కొరియాలు ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలే, వాణిజ్య, ఆర్థిక సహకారంలో పరస్పరం కీలక భాగస్వాములే. ప్రాంతీయాభివృద్ధిని మరింత పెంచే, ప్రాంతీయ ఆర్థిక సమగ్రతకు మార్గనిర్దేశనం చేసే, ప్రాంతీయ శాంతి భద్రతలు పరిరక్షించుకునే మహత్తర బాధ్యతలు తమకు వున్నాయని చైనా ప్రధాని పేర్కొన్నారు. త్రైపాక్షిక సహకారాన్ని పటిష్టపరచాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతూ లీ, ఈ మూడు దేశాల అవసరాలను తీర్చడమే కాకుండా, ప్రాంతీయ, అంతర్జాతీయ సమాజం ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించేలా చూడడం కూడా ముఖ్యమైన కర్తవ్యమేనన్నారు. అబె మాట్లాడుతూ, తమ వంతుగా స్వేచ్ఛా వాణిజ్యానికి కట్టుబడి వుంటామని హామీ ఇచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య భాగస్వాములుగా, తమ మూడు దేశాలు స్వేచ్ఛా వాణిజ్యానికి, బహిరంగ మార్కెట్లకు మద్దతిస్తామని చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.