యాప్నగరం

Honda Cars: ఆ హోండా కార్లు ఇక కనిపించవు.. అస్సలు కొనలేరు.. అసలు కారణం ఇదే..

Honda Cars: ప్రముఖ ఆటో మానుఫ్యాక్చరర్ హోండా కీలక ప్రకటన చేసింది. వివిధ మోడళ్లకు చెందిన కార్ల తయారీని నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఏప్రిల్ నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. దీనికి కారణాలేంటో, ఏయే మోడళ్ల తయారీ నిలిపివేయనుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Authored byపూర్ణచందర్ తూనం | Samayam Telugu 4 Apr 2023, 6:42 am
Honda Cars: దిగ్గజ కార్ల తయారీ సంస్థ హోండా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో ఎంపిక చేసిన కొన్ని కార్ల మోడళ్లను ఇక విడుదల చేయబోమని ప్రకటించింది. అంటే వాటి తయారీని నిలిపివేయనున్నట్లు వెల్లడించింది. హోండా జాజ్, హోండా WR-V సహా హోండా సిటీ ఫోర్త్ జనరేషన్ కార్ల తయారీ ఏప్రిల్ నుంచి ఉండబోదని స్పష్టం చేసింది. భారత్ స్టేజ్ (BS) VI ఫేజ్ 2 వాహన ఉద్గార నిబంధనలు అమల్లోకి రాబోయే ముందు హోండా కంపెనీ ఈ కీలక ప్రకటన చేయడం గమనార్హం. 2023 ఏప్రిల్ 1 నుంచి వాహన ఉద్గార నిబంధనలకు సంబంధించి రెండో దశ అమల్లోకి రానుంది. దీని మొదటి దశ 2020లోనే అమల్లోకి వచ్చింది. కొత్త ఉద్గార నిబంధనల ప్రకారం.. ఇక రియల్ టైం డ్రైవింగ్ ఎమిషన్ లెవెల్స్‌ను పర్యవేక్షించేందుకు ప్రతి వాహనంలో ప్రత్యేకంగా సెల్ఫ్ డయాగ్నోస్టిక్ డివైజ్ ఉండాల్సిందే.
Samayam Telugu honda cars


ఇది వాహనంలోని అన్ని పార్ట్స్‌కు సంబంధించి సరిగా ఉన్నాయో లేదో నిర్ధరిస్తుందన్నమాట. అయితే దీని కోసం వాహనాల తయారీ ఖర్చులు పెరుగుతాయి. ఇప్పటికే వాహనాల ముడిభాగాల ఖర్చులు పెరిగిపోయిన నేపథ్యంలో.. ఆయా కార్ల తయారీ కంపెనీలు ఇప్పటికే రేట్లు పెంచుతున్నాయి. ఇదే క్రమంలో కొన్ని కంపెనీలు మాత్రం.. ఆయా వాహనాలను డిస్‌కంటిన్యూ చేస్తున్నాయి. ఇప్పుడు హోండా అదే నిర్ణయం తీసుకుంది. పలు మోడళ్ల తయారీని నిలిపివేసింది.

Jewellery Sold: రూ.86 కోట్ల విలువైన ఆభరణాలు అమ్ముకున్న బ్యాంక్..? కోర్టుకెక్కిన జంట.. ఎన్ని ట్విస్ట్‌లో.. Twitter Code Leak: ట్విట్టర్ కీలక డేటా లీక్.. ఆ వెబ్‌సైట్‌లో ప్రత్యక్షం.. తలపట్టుకుంటున్న మస్క్.. అయ్యయ్యో ఎంత పనైంది..!

ఇప్పటికే హోండా కంపెనీ వచ్చే నెల నుంచి కార్ల ధరల్ని పెంచనున్నట్లు కూడా ప్రకటించింది. ఎంట్రీ లెవెల్ కాంపాక్ట్ సెడాన్, అమేజ్ సహా ఇతర మోడళ్ల కార్ల రేట్లను రూ.12 వేల వరకు పెంచనున్నట్లు తెలిపింది. వాహన కొత్త ఉద్గార నిబంధనలు అమల్లోకి రానున్న నేపథ్యంలో.. ప్రొడక్షన్ ఖర్చుల్ని తగ్గించుకునే పనిలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.

Finance Ministry: అదానీ ఎఫెక్ట్.. బ్యాంకులకు నిర్మలా సీతారామన్ హెచ్చరికలు.. ఇక అలా చేయాలంటూ ఆదేశాలు!

రచయిత గురించి
పూర్ణచందర్ తూనం
తూనం పూర్ణ చందర్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. పూర్ణచందర్‌కు జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.