This Lic Pension Scheme May Close! Ensure Rs 10000 Per Month Now
LIC స్కీమ్ అదిరింది.. చేతికి ప్రతి నెలా రూ.10,000!
దేశీ దిగ్గజ బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఎన్నో రకాల పాలసీలను అందిస్తోంది. మనీ బ్యాక్, టర్మ్, పెన్షన్, హెల్త్ ఇలా పలు ఇన్సూరెన్స్ ప్లాన్లను కస్టమర్లకు అందుబాటులో ఉంచింది. ఎల్ఐసీ సీనియర్ సిటిజన్స్ కూడా ప్రత్యేకమైన పెన్షన్ స్కీమ్ అందిస్తోంది. దీని పేరు వయ వందన యోజన.
Samayam Telugu13 Jan 2020, 1:16 pm
దేశీ దిగ్గజ బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఎన్నో రకాల పాలసీలను అందిస్తోంది. మనీ బ్యాక్, టర్మ్, పెన్షన్, హెల్త్ ఇలా పలు ఇన్సూరెన్స్ ప్లాన్లను కస్టమర్లకు అందుబాటులో ఉంచింది. ఎల్ఐసీ సీనియర్ సిటిజన్స్ కూడా ప్రత్యేకమైన పెన్షన్ స్కీమ్ అందిస్తోంది. దీని పేరు వయ వందన యోజన.
మార్చి వరకు అందుబాటులో
ఎల్ఐసీ పీఎంవీవీవై స్కీమ్ మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అటుపైన ఈ స్కీమ్ను కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తే.. మళ్లీ అందుబాటులోకి రావొచ్చు. లేదంటే లేదు. 60 ఏళ్లకు పైన వయసు ఉన్న వారు ఈ ఎల్ఐసీ పథకంలో చేరొచ్చు.
ఎల్ఐసీ వయ వందన యోజన స్కీమ్లో చేరడం వల్ల సంవత్సరానికి 8 శాతం నుంచి 8.3 శాతం వరకు రాబడి పొందొచ్చు. వడ్డీ మొత్తం మీరు ఎంచుకునే పేమెంట్ ఆప్షన్ ప్రాతిపదికన మారుతుంది. అందువల్ల స్కీమ్లో చేరేటప్పుడే పేమెంట్ ఆప్షన్ గురించి ఆలోచించండి.
వయ వందన యోజన స్కీమ్లో చేరిన వారికి పెన్షన్ డబ్బులు తీసుకోవడానికి నాలుగు ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. నెల నెలా డబ్బులు తీసుకోవచ్చు. మూడు నెలలకు ఒకసారి డబ్బులు తీసుకునే ఆప్షన్ ఉంది. లేదంటే ఆరు నెలలకు ఒకసారి పెన్షన్ డబ్బులు పొందొచ్చు. ఇవ్వన్నీ వద్దనుకుంటే ఏడాదికి ఒకసారి పెన్షన్ డబ్బులు పొందే ఛాన్స్ కూడా ఉంది.
ఎల్ఐసీ వయ వందన యోజన స్కీమ్ ద్వారా కనీస పెన్షన్ పొందాలంటే ముందుగా రూ.1.5 లక్షలు పథకంలో ఇన్వెస్ట్ చేయాలి. ఈ మొత్తంపై ప్రతి నెలా రూ.1,000 పెన్షన్ తీసుకోవచ్చు. డిపాజిట్ మొత్తం పెంచుకుంటే ప్రతి నెలా తీసుకునే పెన్షన్ కూడా పెరుగుతుంది.
ప్రధాన్ మంత్రి వయ వందన యోజన స్కీమ్లో చేరడం వల్ల నెలకు గరిష్టంగా రూ.10,000 వరకు కూడా పెన్షన్ తీసుకోవచ్చు. అయితే దీని కోసం మీరు స్కీమ్లో చేరేటప్పుడు రూ.15 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
ప్రధాన్ మంత్రి వయ వందన యోజన స్కీమ్ మెచ్యూరిటీ కాలం పదేళ్లు. అంటే మీరు మీ డబ్బును పదేళ్లపాటు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల మీకు డబ్బుతో ఎలాంటి అవసరం లేదనుకుంటేనే ఈ స్కీమ్లో చేరడం మంచిది. లేదంటే మీ వద్ద అదనంగా ఉన్న డబ్బును ఈ పథకంలో డిపాజిట్ చేయొచ్చు.
ఈ స్కీమ్ కింద లోన్ సౌకర్యం కూడా పొందొచ్చు. మూడేళ్ల తర్వాతి నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుంది. మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బులో 75 శాతం వరకు మొత్తాన్ని రుణం కింద తీసుకోవచ్చు. నెఫ్ట్ లేదా ఆధార్ ఆధారిత పేమెంట్ సిస్టమ్ ద్వారా పెన్షన్ చెల్లిస్తారు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే వయ వందన యోజన స్కీమ్కు ఆధార్ నెంబర్ను తప్పనిసరి చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అంటే ఈ స్కీమ్లో చేరేవారు ఆధార్ ధ్రువీకరణ కచ్చితంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తరుపున ఎల్ఐసీ ఈ స్కీమ్ను అమలు చేస్తుంది.
వయ వందన యోజన స్కీమ్లో చేరిన తర్వాత సబ్స్క్రైబర్ మరణిస్తే.. అప్పుడు డిపాజిట్ చేసిన మొత్తాన్ని ఆయన నామినీకి అందజేస్తారు. దీంతో స్కీమ్లో చేరిన వారు భయపడాల్సిన అవసరం లేదు. అయితే నామినీ పేరు అందజేయడం మరువొద్దు.
వయ వందన స్కీమ్లో చేరిన తర్వాత తీసుకునే పెన్షన్ మొత్తంపై పన్ను పడుతుంది. మీ ఇన్కమ్ ట్యాక్స్ శ్లాబ్ ప్రాతిపదికన పన్ను చెల్లించాలి. ఇకపోతే ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా ఈ స్కీమ్లో చేరొచ్చు.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.