యాప్నగరం

వరుసగా ఆరో రోజూ తగ్గిన పసిడి ధరలు!

గత వారం రోజులుగా సాగుతోన్న పసిడి ధరలు పతనం ఈ రోజు కూడా కొనసాగింది. అంతర్జాతీయంగానూ బంగారం ధరలు తగ్గడంతో దేశీయ మార్కెట్‌లోనూ ఆ ప్రభావం కనిపించింది.

TNN 8 May 2017, 4:16 pm
గత వారం రోజులుగా సాగుతోన్న పసిడి ధరలు పతనం ఈ రోజు కూడా కొనసాగింది. బులియన్‌ మార్కెట్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.175 తగ్గి రూ.28,550కు చేరుకుంది. దీంతో మార్కెట్‌లో బంగారం ధరలు ఏడు వారాల కనిష్ఠానికి చేరుకున్నాయి. వెండి కూడా పుత్తడి బాటలోనే పయనించింది. కిలో వెండి ధర రూ.225 తగ్గి రూ.38,350కి చేరింది. మరో పక్క అంతర్జాతీయ మార్కెట్‌లోనూ పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1229 డాలర్ల నుంచి 1224 డాలర్లకు తగ్గింది.
Samayam Telugu todays gold rates fall in indian bullion market
వరుసగా ఆరో రోజూ తగ్గిన పసిడి ధరలు!


గతేడాది నవంబరు 11 తర్వాత అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గడం ఇదే తొలిసారి. ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఇమాన్యూయేల్ మేక్రాన్ విజయం సాధించడంతో యూరో మార్కెట్‌లో సానుకూల ఫలితాలు వెలువడ్డాయి. దీంతో అంతర్జాతీయంగా బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపింది.
స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడం, అంతర్జాతీయంగా డాలర్‌తో రూపాయి మారకపు విలువ బలపడటం వల్ల బంగారం ధర తగ్గిందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

అలాగే పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుంచి ఆర్డర్లు లేకపోవడం వల్ల వెండి ధరలు తగ్గాయని వ్యాఖ్యానించారు. వస్తు సేవల పన్ను అమల్లోకి వచ్చిన తర్వాత భారత్‌లో జులై తర్వాత బంగారానికి డిమాండ్ ఉంటుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.