యాప్నగరం

భారీగా తగ్గిన పసిడి ధరలు!!

గత పది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు రెండు రోజుల కిందట స్వల్పంగా పెరిగింది. అయితే ఈ రోజు ట్రేడింగ్‌లో మాత్రం ధర మరోసారి పతనమైంది.

Samayam Telugu 11 May 2017, 5:19 pm
గత పది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు రెండు రోజుల కిందట స్వల్పంగా పెరిగింది. అయితే ఈ రోజు ట్రేడింగ్‌లో మాత్రం ధర మరోసారి పతనమైంది. 10గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.265 తగ్గి రూ.28,400 పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 26,650కు చేరుకుంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట‌్‌లోనూ పసిడి ధరలు పతనం సాగుతోంది. ఔన్సు బంగారం ధర 1220 డాలర్ల దగ్గర కొనసాగుతుంది. మంగళవారం 1213 డాలర్లకు తగ్గి ఎనిమిది వారాల కనిష్ఠానికి చేరుకుంది. నిన్న కొంత కోలుకున్నట్లు కనిపించినా ఈ రోజు మాత్రం పతనం తప్పలేదు.
Samayam Telugu todays gold rates in indian trade market
భారీగా తగ్గిన పసిడి ధరలు!!


అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించకపోవడంతో బంగారం ధరలు తగ్గుదలకు కారణమని బులియన్‌ ట్రేడింగ్‌ వర్గాలు పేర్కొన్నాయి. మరోపక్క బంగారం బాటలోనే వెండి కూడా పయనించింది. కిలో వెండి ధర రూ.205 తగ్గి రూ.38,200లకు చేరింది. పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్‌ తగ్గడంతో వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయని మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం ధర 0.19శాతం తగ్గి 1,218.80 డాలర్లు పలికింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.