యాప్నగరం

రెండు వారాల కనిష్ఠానికి పసిడి ధర!!

నోట్ల రద్దు తర్వాత అమాంతం పెరిగిన బంగారం ధర డిసెంబరులో తగ్గుముఖం పట్టినా మళ్లీ పెరిగింది.

TNN 25 Jan 2017, 4:00 pm
నోట్ల రద్దు తర్వాత అమాంతం పెరిగిన బంగారం ధర డిసెంబరులో తగ్గుముఖం పట్టినా మళ్లీ పెరిగింది. అంతర్జాతీయంగా ధరలు పెరగడం, దేశీయ మార్కెట్లో వ్యాపారుల డిమాండ్ ప్రభావంతో కొద్ది రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ఈ రోజు త‌గ్గుముఖం ప‌ట్టింది. బులియన్ మార్కెట్లో ప‌సిడి ధరలు రెండు వారాల కనిష్ఠానికి చేరుకుంది.
Samayam Telugu todays gold rates reduce in bullian market
రెండు వారాల కనిష్ఠానికి పసిడి ధర!!


దేశీ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.175 మేర తగ్గి రూ. 29,550కు చేరుకుంది. మ‌రోవైపు కిలో వెండి ధ‌ర కూడా 340 రూపాయలు తగ్గి రూ.41,500కు చేరుకుంది. ఆభరణాల తయారీదారులు పసిడి కొనుగోళ్లకు ఆసక్తి చూపకపోవడంతో ధరలు తగ్గినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే చైనా నూతన ఏడాది వేడుకల ప్రభావం కూడా బంగారం మీద ఉందని భావిస్తున్నారు. మరో పక్క అంతర్జాతీయంగానూ ఔన్స్ బంగారం ధర 1219 డాలర్ల నుంచి 1209 డాలర్లకు చేరుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.