యాప్నగరం

Office Spa​ce Leasing: Hyderabad లో ఆఫీసులకు తెగ డిమాండ్.. Real Estate కు రెక్కలు.. అసలు కారణమిదే..!

Office Space Leasing: కొవిడ్ నుంచి బయటపడ్డ తర్వాత రియల్ ఎస్టేట్‌ మళ్లీ ఊపందుకుంది. ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కావడం, ఆదాయాలు పెరిగిపోవడం వల్ల రియల్ ఎస్టేట్‌పై మనసు మళ్లుతోంది. అయితే ముఖ్యంగా ఆఫీస్ లీజింగ్‌లు భారీగా పెరిగిపోయాయట. హైదరాబాద్‌ కూడా ఈ లిస్ట్‌లో ముందంజలో ఉంది.

Authored byపూర్ణచందర్ తూనం | Samayam Telugu 21 Feb 2023, 1:34 pm
Office Space Leasing: ఆదాయం పెరిగిపోయిన నేపథ్యంలో జనం మనసు రియల్ ఎస్టేట్‌వైపు వెళ్తోంది. చాలినంత డబ్బు ఉండటం.. ఎదురుగా ఆప్షన్ కనిపిస్తుండటం కారణంగా రియల్ ఎస్టేట్ దిశగా పయనించేవారు కోకొల్లలు. ఇంకొందరు.. ఎక్కడోచోట డబ్బు సర్ది మరీ.. భూములు, ప్లాట్లు కొంటున్నారు. అయితే ఇదే సమయంలో ఆఫీస్ స్పేస్ లీజింగ్‌కు తెగ డిమాండ్ నెలకొంది. అన్ని రకాల బిల్డింగుల్లో కార్యాలయాల కోసం లీజుకు తీసుకునే వారి సంఖ్య ప్రధాన నగరాల్లో భారీగా పెరిగింది. గతేడాది నుంచి చూస్తే గనుక ఆఫీస్ స్పేస్ లీజింగ్ ఏకంగా 93 శాతం పెరగడం విశేషం. దిల్లీ- NCR, ముంబయి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పుణె, కోల్‌కతా ఈ నగరాల జాబితాలో ఉన్నాయి.
Samayam Telugu hyderabad office space leasing


ఈ జనవరిలో దేశంలోని 7 ప్రధాన నగరాల్లో.. మొత్తం 3.2 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని వివిధ కంపెనీలు కార్యాలయాల కోసం లీజుకు తీసుకున్నాయట. ఈ మేరకు ప్రముఖ స్థిరాస్తి సంస్థ జేఎల్ఎల్ ఇండియా (JLL India) పేర్కొంది. జనవరిలో గతేడాదితో పోలిస్తే పెరిగినప్పటికీ.. డిసెంబర్‌తో చూస్తే మాత్రం పడిపోవడం గమనార్హం. 2022, డిసెంబర్‌లో ఏకంగా 7.4 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకోవడం విశేషం. ఈ సమాచారంలో ప్రీ కమిట్‌మెంట్స్, టర్మ్ రెనివల్స్ కూడా ఉన్నాయి. చర్చల దశల్లో ఉన్న డీల్స్‌ను మాత్రం ఇందులో ప్రస్తావించలేదు.

డిసెంబర్‌తో పోలిస్తే తగ్గడానికి కారణాన్ని వివరించింది జేఎల్‌ఎల్ ఇండియా. ప్రపంచ దిగ్గజ కంపెనీలకు జనవరిలో హాలిడే సీజన్ అని, అందుకే వ్యాపార కార్యకలాపాలు కూడా నెమ్మదిస్తాయని చెప్పింది. అంతకుముందు ఆగిపోయిన చాలా డీల్స్ కూడా ఇదే నెలలో ముగిసేందుకు అవకాశాలుంటాయని చెప్పుకొచ్చింది. ఆఫీస్ లీజింగ్స్‌లో మొత్తంలో దిల్లీ- NCR, చెన్నై, ముంబయి మాత్రమే వీటిల్లో 77 శాతం వాటా కలిగి ఉండటం విశేషం. తర్వాతి స్థానాల్లో హైదరాబాద్, బెంగళూరు వంటివి ఉన్నాయట. ఆఫీసు లీజుకు తీసుకునే వాటిల్లో ఎక్కువగా ఐటీ కంపెనీలే ఉంటున్నాయని, కానీ ప్రస్తుతం ఐటీ రంగానికి అంత మంచి పరిస్థితులు కనిపించట్లేదని జేఎల్‌ఎల్ చీఫ్ ఎకనామిస్ట్ శమంతక్ దాస్.

రచయిత గురించి
పూర్ణచందర్ తూనం
తూనం పూర్ణ చందర్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. పూర్ణచందర్‌కు జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.