యాప్నగరం

జతకట్టిన 'ఆటోమొబైల్' దిగ్గజాలు...!

ప్రఖ్యాత 'ఆటోమొబైల్' దిగ్గజాలైన... టయోటా మోటార్‌ కార్ప్‌, సుజుకీ మోటార్‌ కార్ప్‌లు జతకట్టాయి. ఇకపై భారత్‌లో ఈ రెండు సంస్థలకు... చెందిన హైబ్రిడ్ కార్లను.. ఒకరి కార్లను మరొకరు... సరఫరా చేయనున్నారు.

TNN 30 Mar 2018, 12:08 pm
ప్రఖ్యాత 'ఆటోమొబైల్' దిగ్గజాలైన... టయోటా మోటార్‌ కార్ప్‌, సుజుకీ మోటార్‌ కార్ప్‌లు జతకట్టాయి. ఇకపై భారత్‌లో ఈ రెండు సంస్థలకు... చెందిన హైబ్రిడ్ కార్లను.. ఒకరి కార్లను మరొకరు... సరఫరా చేసుకోనున్నారు. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య మార్చి 29న (గురువారం) ఒప్పందం కుదిరింది. ఈ రెండు కూడా జపాన్‌కు చెందిన సంస్థలే కావడం విశేషం. టయోటా సంస్థ ఇప్పటికే... కార్ల విపణిలో... ప్రపంచంలోనే ఐదో స్థానంలో కొనసాగుతోంది. తాజా ఒప్పందంతో ... భారత్‌లోనూ తన మార్కెట్ వాటాను పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది.
Samayam Telugu cars


తాజా ఒప్పందం ప్రకారం సుజుకీ సంస్థ... హ్యాచ్‌బ్యాక్‌ బలెనో గ్యాసోలిన్‌, మైల్డ్‌ గ్యాసోలిన్‌ హైబ్రిడ్‌ వెర్షన్‌లను, కాంపాక్ట్‌ ఎస్‌యూవీ విటారా బ్రెజాలను.... టయోటా సంస్థకు సరఫరా చేయనుంది. అదే సమయంలో... టయోటా సంస్థ... సెడాన్‌ మోడల్‌ కరోలా గ్యాసోలిన్‌, గ్యాసోలిన్‌ హైబ్రిడ్‌ వెర్షన్‌లను... సుజుకీ సంస్థకి సరఫరా చేయనుంది.

పరిశోధన, అభివృద్ధి... కోసం ఈ రెండు జపాన్‌ సంస్థలు... గతేడాది నవంబరులోనే అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. తాజా నిర్ణయంతో... రెండు సంస్థలు పరస్పర సహకారానికి మార్గం సుగమమైంది. 2019 మధ్య నాటికి ఉత్పత్తి ప్రారంభం కానుంది. భారత్‌లో ఈ రెండు కంపెనీలు 2020 నాటికి విద్యుత్‌ కార్లను తీసుకురావాలన్న ప్రణాళికలో ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.