యాప్నగరం

జియో నెట్‌వర్క్‌పై ట్రాయ్ పరిశీలన

రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ నెట్‌వర్క్ పనితీరుపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) దృష్టి సారించింది.

TNN 5 Nov 2016, 5:02 pm
రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ నెట్‌వర్క్ పనితీరుపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) దృష్టి సారించింది. ముఖేశ్ అంబానీకి చెందిన ఈ జియో నెట్‌వర్క్‌లో విపరీతంగా కాల్ ఫెయిల్యూర్స్ సంభవిస్తున్నాయని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు రావడంతో ఈ నెట్‌వర్క్ పనితీరును ట్రాయ్ పరిశీలిస్తోందని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.
Samayam Telugu trai checking readiness of reliance jio network
జియో నెట్‌వర్క్‌పై ట్రాయ్ పరిశీలన


దేశంలో ఉన్న టెలికాం నెట్‌వర్క్‌ల ద్వారా వినియోగదారులకు ఉత్తమమైన సర్వీసులు అందేలా చూడటమే తమ పని అని ఆయన తెలిపారు. జియో నెట్‌వర్క్‌లో తలెత్తిన కాల్ ఫెయిల్యూర్స్‌తో పాటు ఇతర సమస్యలను సరిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈమెయిల్ ద్వారా వస్తోన్న ప్రశ్నలకు జియో స్పందించడం లేదని చెప్పారు.

ప్రస్తుతం జియో నుంచి వెళ్లే కాల్స్‌లో రోజుకి 50 నుంచి 60 శాతం విఫలమవుతున్నట్లు సమాచారం. నాణ్యతా ప్రమాణాల ప్రకారం అత్యధికంగా 0.5 శాతం కాల్ ఫెయిల్యూర్స్‌కు మాత్రమే అనుమతి ఉంది. అంటే ఒక రోజులో వెయ్యి కాల్స్ వెళ్తే అందులో అత్యధికంగా 5 ఫెయిల్యూర్లకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో జియో తీవ్రంగా విఫలమైందనే చెప్పాలి. మరోవైపు భారత్‌లో ప్రధాన టెలీకాం ఆపరేటర్లు అయిన భారతీ ఎయిర్‌టెల్, ఐడియా సెల్యులర్, వొడాఫోన్ ఇండియా కూడా జియో నెట్‌వర్క్‌పై ఇప్పటికే ట్రాయ్‌కి ఫిర్యాదు చేశాయి. ఇంటర్‌కనెక్షన్ లైసెన్స్ నిబంధనలను జియో భ్రష్టుపట్టించిందని, దీని వల్ల తమ వినియోగదారులు కాల్ ఫెయిల్యూర్స్‌తో ఇబ్బంది పడుతున్నారని ట్రాయ్‌కు మొర పెట్టుకున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.