యాప్నగరం

జియో సబ్‌స్క్రైబర్స్‌కి బ్యాడ్ న్యూస్!!

ఈ ఏప్రిల్ 15వ తేదీలోగా జియో ప్రైమ్‌లో చేరబోయే కొత్త కస్టమర్లని ఆకట్టుకోవడం కోసం రిలయన్స్ జియో ప్రకటించిన సమ్మర్...

ET Online 7 Apr 2017, 10:14 am
ఈ ఏప్రిల్ 15వ తేదీలోగా జియో ప్రైమ్‌లో చేరబోయే కొత్త కస్టమర్లని ఆకట్టుకోవడం కోసం రిలయన్స్ జియో ప్రకటించిన సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్‌ని ఉపసంహరించుకోవాల్సిందిగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) ఆ సంస్థని ఆదేశించింది. ట్రాయ్ ఆదేశాలపై స్పందించిన జియో.. రూ.303 రీచార్జ్‌పై ప్రకటించిన 3 నెలల ఉచిత సబ్‌స్క్రిప్షన్ ఆఫర్‌ని ఉపసంహరించుకుంటున్నట్టు పేర్కొంది. ''ఇకపై తమ సంస్థ గతంలో ప్రకటించిన నెలవారీ రీచార్జ్‌లతోనే కస్టమర్లు జియో సేవలు పొందాల్సి వుంటుంది" అని జియో స్పష్టంచేసింది. అయితే, రూ.99 చెల్లించి జియో ప్రైమ్‌లో చేరబోయే కస్టమర్లకి ఏప్రిల్ 15వరకు గడువు యధావిధిగా వుంటుందని జియో తెలిపింది.
Samayam Telugu trai forces reliance jio to withdraw its summer free offer
జియో సబ్‌స్క్రైబర్స్‌కి బ్యాడ్ న్యూస్!!


ట్రాయ్ తీసుకున్న ఈ చర్యలు జియోకి వ్యాపార ప్రత్యర్థులైన భారతీ ఎయిర్ టెల్, వొడాపోన్ ఇండియా, ఐడియా సెల్యులార్ వంటి సంస్థలకి కలిసొచ్చే అంశం కానుంది. ఇప్పటికే గతంలో రిలయన్స్ జియో ప్రకటించిన రెండు ఉచిత ఆఫర్ల( వెల్‌కమ్ ఆఫర్, హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ )ని ఆ సంస్థ విజయవంతంగా పూర్తి చేసుకోగలిగింది.

దీంతో జియోకి ప్రత్యర్థులైన టెలికాం సంస్థలకి సబ్‌స్క్రైబర్ల రూపంలో భారీగా నష్టం వాటిల్లింది. కానీ ట్రాయ్ తాజా ఆదేశాలతో ఆ సంస్థలకి కొంత ఉపశమనం లభించనుంది. ఒక విధంగా నిరంతంరంగా జియోపై పోరాటం చేస్తూ వస్తున్న ఆ సంస్థ ప్రత్యర్థులకి ఇది పరోక్ష విజయంగా అభివర్ణిస్తున్నాయి మార్కెట్ వర్గాలు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.