యాప్నగరం

ఆధార్ కోసం ప్రభుత్వం అంత ఖర్చు చేసిందా?

ఆధార్ నమోదు, జారీ కోసం యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎంత ఖర్చు చేసిందో తెలుసా?

TNN 27 Jul 2017, 1:24 pm
ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌లు సమర్పించాలన్నా, రేషన్ సరకులు కావాలన్నా.. గ్యాస్ సబ్సిడీ పొందాలన్నా.. ఇలా ప్రతి దానికి ఆధార్‌తో అనుసంధానం తప్పనిసరైంది. ఆధార్ కార్డు లేనిదే దాదాపుగా ఏ పని చేయలేని పరిస్థితి. ఇంతలా ప్రభుత్వం ప్రతి కార్యక్రమాన్ని ఆధార్‌తో ముడిపెట్టింది. మరి ఆధార్ కోసం వివరాలు సేకరించడానికి, ఆధార్ కార్డుల జారీకి ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో తెలుసా? 2009-10 నుంచి 2017-18 వరకు ఆధార్ కోసం యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) వెచ్చిస్తోన్న మొత్తం అక్షరాలా రూ. 9,055.73 కోట్లు. 2018 జూలై 18 వరకు యూఐడీఏఐ ఆధార్ కోసం ఖర్చుపెట్టనుంది.
Samayam Telugu uidai has spent rs 9055 crore to enrol despatch aadhaar numbers
ఆధార్ కోసం ప్రభుత్వం అంత ఖర్చు చేసిందా?


ఈ లెక్కలు మేం చెబుతున్నవి కాదు. సాక్షాత్తూ కేంద్ర మంత్రి పి.పి. చౌధురీ లోక్‌సభలో లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానమిది. ఆధార్ నమోదు కోసం రూ. 3,819.97 కోట్లు, కార్డుల ముద్రణ, పంపిణీ కోసం రూ. 1,171.45 కోట్లను ప్రభుత్వం ఖర్చు పెట్టింది. జూలై 21 నాటికి 116.09 కోట్ల మందికి ఆధార్ నంబర్లు జనరేట్ చేయగా.. 115.15 కోట్ల మందికి వాటిని చేరవేశారు.

నగదు బదిలీని పారదర్శకంగా, సమర్థవంతంగా అమలు చేయడంలో ఆధార్ కీలక పాత్ర పోషిస్తోందని చౌధురి తెలిపారు. 51 మంత్రిత్వ శాఖల పరిధిలోని 314 పథకాల్లో నగదు బదిలీ కార్యక్రమం కొనసాగుతోందని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా లేదా పాక్షికంగా నిధుల అందజేసే పథకాలన్నింటికీ ఆధార్ అమలు చేస్తున్నారు. నగదు బదిలీ కోసం ఆధార్‌ను ఉపయోగించాలని రాష్ట్రాలను కోరినట్లు మంత్రి తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.