యాప్నగరం

Akshata Murty: బ్రిటన్ PM Rishi Sunak, అక్షత దంపతులకు పెద్ద దెబ్బ.. వేల కోట్ల నష్టం.. అసలు కారణమిదే..

Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్- అక్షతా మూర్తి దంపతుల ఆస్తిలో భారీ క్షీణత కనిపించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఏడాది వ్యవధిలోనే వీరి సంపదలో సుమారు 200 మిలియన్ పౌండ్లు .. భారత కరెన్సీలో రూ.2 వేల కోట్లకుపైనే ఆవిరైందట.

Authored byపూర్ణచందర్ తూనం | Samayam Telugu 6 Jun 2023, 10:18 am
Rishi Sunak: భారత సంతతికి చెందిన రిషి సునాక్.. బ్రిటన్ ప్రధాని అయిన సంగతి తెలిసిందే. ఇక ఆయన భార్య అక్షతా మూర్తి.. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి- సుధా మూర్తి దంపతుల కుమార్తె. ఇక సునాక్- అక్షతా దంపతుల సంపదపై స్థానికంగా బ్రిటన్‌లో చర్చ నడుస్తూనే ఉంటుంది. దేశం ఆర్థిక సంక్షోభం నడుమ కొట్టుమిట్టాడుతున్నప్పటికీ విలాసవంత జీవితం గడుపుతున్నారని విమర్శలొచ్చాయి. ఈ క్రమంలో కొన్ని నెలలుగా ఈ దంపతుల ఆస్తిలో భారీ క్షీణత కనిపించినట్లు రిపోర్ట్స్ వెల్లడిస్తున్నాయి. గడిచిన 12 నెలల వ్యవధిలో వీరి సంపదలో సుమారు 200 మిలియన్ పౌండ్లు ఆవిరయ్యాయట. ఈ లెక్కన రోజుకు సుమారు 5 లక్షల పౌండ్లు కోల్పోతున్నట్లు లెక్క.
Samayam Telugu rishi sunak


ఇటీవల సండే టైమ్స్ విడుదల చేసిన.. బ్రిటన్ సంపన్నుల జాబితాలో సునాక్ దంపతులు 275వ స్థానంలో ఉన్నారు. అంతకుముందు 222వ స్థానంలో ఉండగా.. ఏడాది వ్యవధిలో భారీగా తగ్గడం గమనార్హం. ఇన్ఫోసిస్ షేర్లు భారీగా తగ్గిపోవడమే ఇందుకు కారణమని నిపుణుల అంచనా. అక్షతా మూర్తికి ఇందులో 64 బిలియన్ డాలర్ల వాటా ఉంది. సంస్థ మొత్తం షేర్లలో ఇది ఒక శాతం. ఏడాది నుంచి ఇన్ఫోసిస్ షేరు పడుతున్న క్రమంలో.. సునాక్ దంపతుల సంపద కూడా తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి.


రిషి సునాక్‌ బ్రిటన్ ప్రధానిగా ఉన్నందుకు జీతభత్యాల కింద ఏటా 1.65 లక్షల పౌండ్లు సమకూరుతుంది. గత సంవత్సరం యూకే పీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇరువురి సంపద 730 మిలియన్ పౌండ్లకు చేరుకుంది. ఇటీవల మార్కెట్లు పడుతుండటంతో వారి సంపద విలువ 529 మి. పౌండ్లకు పడిపోయింది. ఇంకా బ్రిటన్‌ను ద్రవ్యోల్బణం కూడా వెంటాడుతోంది. ప్రస్తుతం అది 10 శాతానికి చేరింది.

రూ. 2 వేల నోటు ఉపసంహరణతో కలిగే లాభాలు ఇవే.. కేంద్రం అసలు స్కెచ్ అదేనా?
రచయిత గురించి
పూర్ణచందర్ తూనం
తూనం పూర్ణ చందర్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. పూర్ణచందర్‌కు జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.