అమెరికా వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారా..? అయితే ఇంకా కొన్ని రోజుల్లోనే వీసా ప్రాసెస్ ప్రారంభం కాబోతుంది. అన్ని డాక్యుమెంట్లు సిద్ధం చేసుకుని రెడీగా ఉండండి. అమెరికా సిటిజన్షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(USCIS) హెచ్-1బీ వీసాల రిజిస్ట్రేషన్ ప్రాసెస్ను మార్చి 1 నుంచి ప్రారంభమవుతుందని ప్రకటించింది. ఈ ప్రాసెస్ మార్చి 18, 2022 వరకు కొనసాగనుందని తెలిపింది. అక్టోబర్ 2022 నుంచి అక్కడ ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరానికి గాను ఈ వీసాల జారీ ప్రక్రియ ప్రారంభిస్తోంది. ఈ నిర్దేశిత సమయంలో ఆసక్తిగల పిటిషనర్లు, ప్రతినిధులు తమ హెచ్-1బీ రిజిస్ట్రేషన్లను ఆన్లైన్గా పూర్తి చేసి సమర్పించాలని USCIS తెలిపింది. రిజిస్ట్రేషన్లను పరిశీలించి USCIS ఆర్థిక సంవత్సరం 2023కి గాను హెచ్-1బీ పరిమితిని నిర్ణయిస్తుంది. కొత్త సిస్టమ్ కింద దరఖాస్తుదారులు ఎలక్ట్రానికల్గా రిజిస్టర్ కావాలని, రిజిస్ట్రేషన్ ఫీజు కింద 10 డాలర్లను చెల్లించాలని పేర్కొంది. మార్చి 18 వరకు తగినన్ని రిజిస్ట్రేషన్లు పొందితే.. రాండమ్గా రిజిస్ట్రేషన్లను ఎంపిక చేసి, ఆ యూజర్లకు ఎంపిక చేసిన నోటిఫికేషన్లను పంపనుంది USCIS. మార్చి 31 కల్లా అకౌంట్ హోల్డర్స్కి నోటిఫై చేస్తామని తెలిపింది.
Also Read :బడ్జెట్ 2022 : రైతులకి వరాలు.. పంట అవశేషాల నుంచి కోట్లు సంపాదించే స్కీమ్
ప్రతి ఏడాది 65 వేల కొత్త హెచ్-1బీ వీసాలను అమెరికా జారీ చేస్తుంది. మరో 20 వేల వీసాలను అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చేయాలనుకునే వారికి కేటాయిస్తుంది. ఈ వీసా ప్రొగ్రామ్ వల్ల భారతీయులు ఎక్కువగా లబ్ది పొందుతున్నారు. కొత్త వీసాల్లో ప్రతి ఏడాది భారత్కు 70 శాతం వీసాలు అందుతున్నాయి. గత కొన్నేళ్లుగా వీసాలను కేటాయించేందుకు అమెరికా మల్టిపుల్ లాటరీలను నిర్వహిస్తోంది. అయితే కరోనా మహమ్మారితో ప్రయాణాలు తగ్గడంతో వీసాలపై కూడా ప్రభావం చూపుతోంది.
కాగా, అమెరికా కంపెనీలు హెచ్-1బీ ఉద్యోగులకు 5 వేల డాలర్ల నుంచి 30 వేల డాలర్ల వరకు లీగర్, ప్రభుత్వ ఫీజుల కింద చెల్లిస్తున్నాయి. అంతేకాక వారి పర్మినెంట్ రెసిడెన్స్ కోసం 10 వేల డాలర్ల నుంచి 15 వేల డాలర్ల వరకు స్పానర్స్ చేస్తున్నట్టు నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ తెలిపింది.
20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్ను సబ్స్క్రయిబ్ చేసుకోగలరు.
Also Read :గుడ్న్యూస్.. ఆ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచిన ఎస్బీఐ, కొత్త రేట్లు ఇవే!
Also Read :బడ్జెట్ 2022 : రైతులకి వరాలు.. పంట అవశేషాల నుంచి కోట్లు సంపాదించే స్కీమ్
ప్రతి ఏడాది 65 వేల కొత్త హెచ్-1బీ వీసాలను అమెరికా జారీ చేస్తుంది. మరో 20 వేల వీసాలను అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చేయాలనుకునే వారికి కేటాయిస్తుంది. ఈ వీసా ప్రొగ్రామ్ వల్ల భారతీయులు ఎక్కువగా లబ్ది పొందుతున్నారు. కొత్త వీసాల్లో ప్రతి ఏడాది భారత్కు 70 శాతం వీసాలు అందుతున్నాయి. గత కొన్నేళ్లుగా వీసాలను కేటాయించేందుకు అమెరికా మల్టిపుల్ లాటరీలను నిర్వహిస్తోంది. అయితే కరోనా మహమ్మారితో ప్రయాణాలు తగ్గడంతో వీసాలపై కూడా ప్రభావం చూపుతోంది.
కాగా, అమెరికా కంపెనీలు హెచ్-1బీ ఉద్యోగులకు 5 వేల డాలర్ల నుంచి 30 వేల డాలర్ల వరకు లీగర్, ప్రభుత్వ ఫీజుల కింద చెల్లిస్తున్నాయి. అంతేకాక వారి పర్మినెంట్ రెసిడెన్స్ కోసం 10 వేల డాలర్ల నుంచి 15 వేల డాలర్ల వరకు స్పానర్స్ చేస్తున్నట్టు నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ తెలిపింది.
20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్ను సబ్స్క్రయిబ్ చేసుకోగలరు.
Also Read :గుడ్న్యూస్.. ఆ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచిన ఎస్బీఐ, కొత్త రేట్లు ఇవే!