యాప్నగరం

Vegatable Prices: భారీగా పెరిగిన ధరలు.. సామాన్యులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయ్.. ఇక చుక్కలే!

Vegetable Prices: కరోనా సమయంలో ఓసారి, రష్యా- ఉక్రెయిన్ యుద్ధం సమయంలో ధరలు పెరిగి సామాన్యుల జేబుకు చిల్లుపడింది. అయితే.. ఇప్పుడు అంతా సర్దుకుంటుదనుకున్న తరుణంలో మరోసారి సామాన్యులపై గుదిబండ పడినట్లయింది. కూరగాయల ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. దీంతో వంటింటి బడ్జెట్ పెరిగిపోతోంది. అన్నీ దాదాపు కిలోకు 100 రూపాయలకుపైనే పలుకుతున్నాయి. ఏం కొనాలో, ఏం వండాలో తెలియక జనం అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే దేశంలో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి చేరింది.

Authored byపూర్ణచందర్ తూనం | Samayam Telugu 26 Oct 2022, 4:44 pm

ప్రధానాంశాలు:

  • భారీగా పెరిగిన ధరలు
  • సామాన్యుల జేబుకు చిల్లు
  • రికార్డు స్థాయికి చేరిన కూరగాయల ధరలు
  • అధిక వర్షపాతం, ఇంధన ధరలు పెరగడమే కారణమా?
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu vegetable prices hike
కూరగాయల ధరలు
Vegetable Prices: సామాన్యులపై మరోసారి గుదిబండ పడింది. మళ్లీ జేబులకు చిల్లులు పడనున్నాయి. ధరలు భారీగా పెరగడమే కారణం. ఇంతకీ ఏ ధరలు అనుకుంటున్నారా? కూరగాయల ధరలు. అధిక వర్షపాతం కారణంగా పంట నష్టం జరగడంతో.. డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో కూరగాయల సగటు రిటైల్ ధర కిలోకు రూ.120 నుంచి రూ.140 వరకు పలుకుతున్నాయి. కొద్దిరోజుల కిందటి వరకు ముంబయి సహా ఇతర మెట్రో నగరాల్లో రూ.60 నుంచి 80 మధ్యే ఉండటం గమనార్హం. అయితే.. ఇంధన ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చు పెరగడమే కూరగాయలు ధరలు పెంచేందుకు కారణమైందని ట్రేడర్లు చెబుతున్నారు.

ఇప్పటికే ఆహార ధరల ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో పెరుగుతుండగా ఇప్పుడు అధిక వర్షపాతం రూపంలో సామాన్యులకు మరో షాక్ తగిలినట్లయింది. ఇంకా ఆయిల్ అండ్ గ్యాస్ ధరలు కూడా ఇప్పటికే సామాన్యులకు భారంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి కూరగాయల రూపంలో మరింత భారాన్ని మోయక తప్పేలా లేదు. భారీ వర్షాలతో పంట మొత్తం దెబ్బతిందని.. దీంతో అందుబాటు ధరలకు అందించలేకపోతున్నట్లు వ్యాపారులు అంటున్నారు.
ALSO READ: Bank Holidays: ఏకంగా 10 రోజులు బ్యాంకులు బంద్.. సెలవుల జాబితా ఇదే!

మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో టొమాటో ధరలు భారీగా పెరిగాయని.. అయినప్పటికీ మొత్తం పంటలో మళ్లీ 20 నుంచి 30 శాతం వరకే నాణ్యమైందని చెప్పుకొచ్చారు APMC Vashi డైరెక్టర్ శంకర్ పింగాలే. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. అంధేరీ లోఖండ్‌వాలాలో టొమాటోలు కేజీకి రూ.60 పలుకుతోంది. పాలకూర ఒక గుత్తికి రూ.50గా ఉంది. ఇక బెండకాయ కిలోకు రూ.120, గోరు చిక్కుడు కిలోకు రూ.160 పలుకుతోంది. మాథుంగాలో కీరా దోస కూడా కేజీకి రూ.120 పైనే ఉంది.

సాధారణంగా రూ.16-18 మధ్య ఉండే క్యాలీఫ్లవర్ ధర ఇప్పుడు రూ.60పైకి చేరడం గమనార్హం. ట్రేడర్లు కొద్దిరోజుల క్రితం వరకు నిమ్మకాయను ఒక్కొక్కటి 50 పైసల నుంచి రూ.1కి కొనగా ఇప్పుడు అది కాయకు 4-5 రూపాయలకు చేరింది. దేశంలో చాలా వరకు రైతులు పంట నష్టాన్ని ఎదుర్కొన్నారు. సాధారణంగా పంట పండిన తర్వాత ధరలు తగ్గుముఖం పట్టే బదులు పెరుగుతున్నాయి. ఈ ధరలు పెరుగుతుండటంతో దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లక్షిత పరిధి అయిన 6 కంటే ఎక్కువే నమోదవుతోంది. సెప్టెంబర్ నెలలో ద్రవ్యోల్బణం 7.41 శాతంగా నమోదైంది. అధిక ద్రవ్యోల్బణం నేపథ్యంలో ఆర్థిక మాంద్యం అంచనాలు ఎక్కువయ్యాయి. దీంతో.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల వడ్డీ రేట్లను కూడా పెంచింది. ఒకే ఏడాది 190 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను పెంచింది. దీంతో దేశంలో రెపో రేటు 5.4 శాతం నుంచి 5.9 శాతానికి పెరిగింది.

ALSO READ: Dairy Farming: ఈ బిజినెస్ చేస్తే నెలకు లక్షల్లో ఆదాయం.. నో రిస్క్.. ప్రభుత్వం కూడా డబ్బులిస్తుంది.. ఎలా చేయాలో చూడండి!
రచయిత గురించి
పూర్ణచందర్ తూనం
తూనం పూర్ణ చందర్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. పూర్ణచందర్‌కు జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.