యాప్నగరం

సిక్కా ఎఫెక్ట్... గంటలో 16 వేల కోట్లు నష్టం

ఇండియాలో రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సీఈఓ పదవి నుంచి విశాల్ సిక్కా తప్పుకున్నారన్న వార్త, ఆ సంస్థ మార్కెట్ కాపిటలైజేషన్‌ను భారీగా దెబ్బతీసింది.

TNN 18 Aug 2017, 12:31 pm
ఇండియాలో రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సీఈఓ పదవి నుంచి విశాల్ సిక్కా తప్పుకున్నారన్న వార్త, ఆ సంస్థ మార్కెట్ కాపిటలైజేషన్‌ను భారీగా దెబ్బతీసింది. ఈ ఉదయం ట్రేడింగ్ మొదలైన గంట వ్యవధిలోనే ఇన్ఫీ కాపిటలైజేషన్2లో రూ. 16 వేల కోట్లు గంగలో కలసిపోయాయి. ఆ సంస్థ ఈక్విటీ 7 శాతానికి పైగా పతనం కాగా, జూన్ 30 నాటికి రూ. 2.10 లక్షల కోట్లుగా ఉన్న మార్కెట్ కాప్ ఇప్పుడు భారీగా తగ్గిపోయింది. ఈ ఉదయం ట్రేడింగ్ మరికొద్ది నిమిషాల్లో ప్రారంభమవుతుందనగా, బీఎస్ఈకి పంపిన ఫైలింగ్‌లో సిక్కా రాజీనామా, దాన్ని ఆమోదిస్తున్నామన్న సమాచారాన్ని కంపెనీ చేరవేసింది. ఆ వెంటనే ఇన్ఫోసిస్ ఈక్విటీ విలువ 5 శాతం నష్టంతో ట్రేడ్ అయి, మరింతగా దిగజారింది. ఇన్ఫోసిస్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవులకు విశాల్ సిక్కా రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
Samayam Telugu vishal sikkas exit infosys loses rs 16 thousen crores within one hour
సిక్కా ఎఫెక్ట్... గంటలో 16 వేల కోట్లు నష్టం


విశాల్ రాజీనామాను ఆమోదించిన కంపెనీ.. ఆయన్ని ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్మన్‌గా నియమించింది. ఈ మేరకు శుక్రవారం కంపెనీ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. తాత్కాలిక ఎండీ, సీఈవోగా యు.బి. ప్రవీణ్ రావును నియమిస్తున్నట్లు ఇన్ఫోసిస్ పేర్కొంది. ​ 2014 జూన్‌ 12న ఇన్ఫోసిస్‌ సీఈవో, ఎండీగా బాధ్యతలు చేపట్టిన విశాల్ సిక్కా ఆ పదవుల్లో మూడేళ్లపాటు కొనసాగారు. అనేక అంతర్గత, బాహ్య సమస్యలతో ఇన్ఫోసిస్ కొంతకాలంగా సతమతమవుతోంది. దీనికి తోడు కంపెనీ సహ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణ మూర్తి నుంచి విశాల్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాను కంపెనీ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకుని తప్పుచేశానని ఒక దశలో నారాయణ మూర్తి వ్యాఖ్యానించడం ఆ సంస్థ అంతర్గత సమస్యలతో కొట్టుమిట్టాడుతుందనేది నిదర్శనం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.