యాప్నగరం

టెలికాం రంగంలో వోడాఫోన్ రూ.47,700కోట్ల పెట్టుబడి

జియో తాకిడికి దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయిన బడా టెలికాం సంస్థలు తమ మనుగడ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాయి

TNN 22 Sep 2016, 9:30 pm
దేశీయ టెలికామ్ రంగంలో జియో సృష్టించిన ప్రకంపనలు అన్నీ ఇన్నీ కావు. పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ చీఫ్ ముకేశ్ అంబానీ జియో సర్వీసులను ప్రకటించిన నాటి నుండి ఈ ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. జియో తాకిడికి దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయిన బడా టెలికాం సంస్థలు తమ మనుగడ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాయి. వోడాఫోన్ గ్రూప్ కూడా జియోను ఎదుర్కోవడానికి భారీ ప్రణాళికతో సిద్ధమైంది. దేశంలో రూ.47,700 కోట్ల భారీ పెట్టుబడి పెట్టింది. ఈ మొత్తంతో రానున్న రోజుల్లో టెలికామ్ స్ప్రెక్టమ్ వేలానికి సిద్ధం కావాలని సంస్థ యోచిస్తోంది.
Samayam Telugu vodafone invests rs 47700 cr into india unit
టెలికాం రంగంలో వోడాఫోన్ రూ.47,700కోట్ల పెట్టుబడి


ఈ మేరకు ఆ సంస్థ ఇండియా చీఫ్ సునీల్ సూద్ మాట్లాడుతూ జియోను దీటుగా ఎదుర్కునే సత్తా తమ సంస్థకు ఉందన్నారు. దేశంలో వోడాఫోనుకు పెద్ద ఆదరణ ఉందనే సంగతి అందరికీ తెలిసిందేనని, రానున్న రోజుల్లో దాన్ని కాపాడుకోవడానికి సంస్థ మరిన్ని ప్రణాళికలతో ముందుకు వెళ్తుందన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.