యాప్నగరం

జియో షాక్‌తో వొడాఫోన్ డబుల్ డేటా ఆఫర్

జియో దెబ్బకు మిగతా టెలీకాం సంస్థలు నేలకు దిగివస్తున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఆఫర్లను ప్రకటిస్తూ కస్టమర్లను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

TNN 8 Dec 2016, 11:34 am
జియో దెబ్బకు మిగతా టెలీకాం సంస్థలు నేలకు దిగివస్తున్నాయి. మార్చి 31 వరకూ ఉచిత ఆఫర్‌ను రిలయన్స్ జియో పొడిగించడంతో మిగతా సంస్థలు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో రేట్లను తగ్గిస్తున్నాయి. ఇప్పటికే బీఎస్‌ఎన్ఎల్, అనిల్ అంబానీ రిలయన్స్ ఆర్ కాం సంస్థలు రేట్లను తగ్గించగా, ఇప్పుడు వొడాఫోన్ ఆ బాట పట్టింది. తమ 4జీ ప్రిపెయిడ్ వినియోగదారుల కోసం డబుల్ డేటా ఆఫర్‌ను ప్రకటించింది.
Samayam Telugu vodafone offers double data at same prices
జియో షాక్‌తో వొడాఫోన్ డబుల్ డేటా ఆఫర్


రూ.255 4జీ డేటా ప్లానులో వొడాఫోన్ ఇప్పటి వరకూ 1 జీబీ డేటాను మాత్రమే అందిస్తుండగా, ప్రస్తుతం దాన్ని రెట్టింపు చేసింది. రూ.459 ప్లానులోనూ 6జీబీ డేటాను అందించనుంది. అలాగే.. మిగతా ప్లాన్లలోనూ ప్రస్తుత రేట్లకే డబుల్ డేటాను అందించనున్నట్లు ఢిల్లీ ఎన్‌సీఆర్ వొడాఫోన్ బిజినెస్ హెడ్ అపూర్వ మెహ్రోత్రా తెలిపారు. ఈ ప్లాన్లన్నింటికీ 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. వొడాఫోన్ గతంలోనే రొమింగ్‌లో ఉచిత ఇన్‌కమింగ్ కాల్స్ సదుపాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.