యాప్నగరం

డిసెంబర్ 31 వరకు ఒక్క పైసా తీసుకోబోం!

రిలయన్స్ జియోకు సంబంధించి ఇటీవల రకరకాల వార్తలు ప్రచారంలోకి రావడం పట్ల సంస్థ స్పందించింది. వెల్‌కమ్ ఆఫర్‌కే కట్టుబడి ఉన్నామని తెలిపింది.

TNN 22 Oct 2016, 3:57 pm
రిలయన్స్ జియో అందిస్తోన్న ఉచిత వాయిస్ కాల్స్ అంశం ట్రాయ్ ఆమోదించిన టారిఫ్ ప్లాన్లలో లేదనే వార్తలు రావడంతో టెలీకాం వర్గాలతోపాటు, జియో వినియోగదారుల్లోనూ కలవరం రేగింది. కస్టమర్లను ప్రధానంగా ఆకర్షించిన ఆఫర్ ఇదే కావడంతో ఈ విషయమై ఆందోళనలు అక్కర్లేదని, జియో ద్వారా నిరంతరాయంగా వాయిస్ కాల్స్ ఉచితంగా చేసుకోవచ్చని ఆ సంస్థ పునరుద్ఘాటించింది. వాయిస్ కాల్స్‌పై ఒక్క పైసా కూడా తీసుకోమని భరోసా ఇచ్చింది. ట్రాయ్‌కు జియో సమర్పించిన ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ టారిఫ్‌లన్నింటిలో ఈ అంశం ఉందని ప్రకటించింది. వాయిస్ కాల్స్‌పై జీరో టారిఫ్ అనేది ప్రమోషనల్ ప్యాకేజీ కాదని, దీన్ని మార్చడం కానీ, వెనక్కి తీసుకోవడ గానీ చేయబోమని తెలిపింది.
Samayam Telugu voice calls will be always free welcome offer upto december 31 reaffirms jio
డిసెంబర్ 31 వరకు ఒక్క పైసా తీసుకోబోం!


జియో ఫ్రీ డేటా సేవలు డిసెంబర్ 3 నాటికే ముగియనున్న విషయమై కూడా కంపెనీ స్పందించింది. కేవలం 90 రోజులపాటే ప్రమోషనల్ ఆఫర్ ఇవ్వడం సాధ్యపడుతుందని ట్రాయ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే జియో వెల్‌కమ్ ఆఫర్ కింద ఉచిత డేటా ఆఫర్‌ను , డిసెంబర్ 3తో ఆపేయమని ముందుగా ప్రకటించినట్లు ఈ ఏడాది చివరి వరకూ ఇస్తామని ప్రకటింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.