Jupiter CEO Andrew Formica : కుటుంబంతో కలిసి సంతోషంగా, హాయిగా బతికేందుకు లక్షల కోట్ల ఉద్యోగాన్ని వదులుకున్నారు ఓ సీఈవో. తనకు వచ్చే రూ.5 లక్షల కోట్లకు పైగా ఉద్యోగాన్ని వద్దనుకున్నారు. లండన్కు చెందిన ఫండ్ హౌస్ జూపిటర్ ఫండ్ మేనేజ్మెంట్కి చెందిన సీఈవో ఆండ్రూ ఫార్మికా తన ఉద్యోగాన్ని వదులుకుంటున్నారు. సీఈవో పోస్టుకి రాజీనామా చేయాలని నిర్ణయించారు. ఉద్యోగం మానేసిన తర్వాత.. ప్రశాంతంగా సముద్రానికి వెళ్లి, బీచ్ని చూస్తూ కూర్చోవాలని ఉందని అన్నారు. ఆండ్రూ 2019లో ఈ ఫండ్ మేనేజ్మెంట్ దిగ్గజంలో 68 బిలియన్ డాలర్లకు(రూ. 5,36,520 కోట్లకు) చేరారు. ఈ ఏడాది అక్టోబర్లో ఆండ్రూ తన పదవికి రాజీనామా చేస్తున్నారు. ఆయన రాజీనామాకు గల కారణాలను, ఫ్యూచర్ ఫ్లాన్ల గురించి బ్లూమ్బర్గ్ ఆండ్రూని సంప్రదించగా.. నాకు ఏమీ చేయాలని లేదు, కేవలం సముద్రాన్ని చూస్తూ కూర్చోవాలని ఉందని తన మనసులోని మాట బయటపెట్టారు. వ్యక్తిగత కారణాలతోనే కంపెనీ సీఈవో పోస్టుకి రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. ఆస్ట్రేలియా వెళ్లి, తల్లిదండ్రులతో కలిసి ఉండాలని ఉందని చెప్పారు.
Also Read : ఉబర్ క్యాబ్లో 50 కి.మీకి రూ.3,000 ఛార్జ్.. దీని కంటే విమానంలో గోవాకి వెళ్లడం బెటర్!
ఆండ్రూ ప్రస్తుతం రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడంతో.. ఆయన స్థానంలో గ్రూప్ ఛీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ మాథ్యూ బీస్లీని కంపెనీ నియమించింది. అక్టోబర్లో ఆండ్రూ దిగిపోయిన తర్వాత ఆయన స్థానంలో మాథ్యూ సీఈవోగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారని రెగ్యులేటరీ ఆమోదాల్లో కంపెనీ తెలిపింది.
ఆండ్రూ తన లాంగ్ టర్మ్ ప్లాన్లను బోర్డుకి తెలిపారు. ఆయన తిరిగి ఆస్ట్రేలియా వెళ్లి, తన ఫ్యామిలీతో ఉండాలనుకుంటున్నారని కంపెనీ తెలిపింది. వ్యాపారాలకు తీవ్ర సవాళ్లు ఎదురైన సమయంలో కూడా ఎక్స్లెంట్ లీడర్గా ఆండ్రూ ఉన్నారని జూపిటర్ ఛైర్మన్ నికోలా పీస్ అన్నారు. ఆయన నిపుణత, విజన్తో వ్యాపారాలను బలోపేతం చేశారని చెప్పారు. మాథ్యూ బీస్లీని కంపెనీ బోర్డు ఎంపిక చేయడం చాలా ఆనందించదగ్గ విషయమని, తన పదవీ బాధ్యతలను ఎలాంటి ఆటంకం లేకుండా ఆయనకి బదిలీ చేసేందుకు బీస్లీతో కలిసి పనిచేస్తానని ప్రస్తుత సీఈవో ఆండ్రూ చెప్పారు.
Also Read : ఊగిసలాటలో స్టాక్ మార్కెట్లు.. ఈ రూ.10 స్టాక్స్పై ఓ లుక్కేయండి!
Also Read : ఉబర్ క్యాబ్లో 50 కి.మీకి రూ.3,000 ఛార్జ్.. దీని కంటే విమానంలో గోవాకి వెళ్లడం బెటర్!
ఆండ్రూ ప్రస్తుతం రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడంతో.. ఆయన స్థానంలో గ్రూప్ ఛీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ మాథ్యూ బీస్లీని కంపెనీ నియమించింది. అక్టోబర్లో ఆండ్రూ దిగిపోయిన తర్వాత ఆయన స్థానంలో మాథ్యూ సీఈవోగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారని రెగ్యులేటరీ ఆమోదాల్లో కంపెనీ తెలిపింది.
ఆండ్రూ తన లాంగ్ టర్మ్ ప్లాన్లను బోర్డుకి తెలిపారు. ఆయన తిరిగి ఆస్ట్రేలియా వెళ్లి, తన ఫ్యామిలీతో ఉండాలనుకుంటున్నారని కంపెనీ తెలిపింది. వ్యాపారాలకు తీవ్ర సవాళ్లు ఎదురైన సమయంలో కూడా ఎక్స్లెంట్ లీడర్గా ఆండ్రూ ఉన్నారని జూపిటర్ ఛైర్మన్ నికోలా పీస్ అన్నారు. ఆయన నిపుణత, విజన్తో వ్యాపారాలను బలోపేతం చేశారని చెప్పారు. మాథ్యూ బీస్లీని కంపెనీ బోర్డు ఎంపిక చేయడం చాలా ఆనందించదగ్గ విషయమని, తన పదవీ బాధ్యతలను ఎలాంటి ఆటంకం లేకుండా ఆయనకి బదిలీ చేసేందుకు బీస్లీతో కలిసి పనిచేస్తానని ప్రస్తుత సీఈవో ఆండ్రూ చెప్పారు.
Also Read : ఊగిసలాటలో స్టాక్ మార్కెట్లు.. ఈ రూ.10 స్టాక్స్పై ఓ లుక్కేయండి!