యాప్నగరం

ఎంఐ టీవీ: నిమిషంలోనే అవుట్ ఆఫ్ స్టాక్..!

షియామీ సంస్థ తక్కువ ధరలకే స్మార్ట్ టీవీలు ప్రకటించిన సంగతి తెలిసిందే... వీటిని ఆన్‌లైన్‌లో విక్రయించడానికి మార్చి 13న మధ్యాహ్నం 12 గంటలకు ముహుర్తం పెట్టింది. తక్కువ ధరలకే స్మార్ట్ టీవీలను ప్రకటించడంతో... వినియోగదారులు పెద్దఎత్తున ఎదురుచూశారు...

TNN 13 Mar 2018, 2:57 pm
షియామీ సంస్థ తక్కువ ధరలకే స్మార్ట్ టీవీలు ప్రకటించిన సంగతి తెలిసిందే... వీటిని ఆన్‌లైన్‌లో విక్రయించడానికి మార్చి 13న మధ్యాహ్నం 12 గంటలకు ముహుర్తం పెట్టింది. తక్కువ ధరలకే స్మార్ట్ టీవీలను ప్రకటించడంతో... వినియోగదారులు పెద్దఎత్తున ఎదురుచూశారు... కానీ సంస్థ వారందరికీ... పెద్ద షాక్ ఇచ్చింది. 32, 43, 55 ఇంచ్ ల స్మార్ట టీవీల అమ్మకం మార్చి 13న, మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుందని ప్రకటించింది. పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసింది. కచ్చితంగా 12 గంటలకు స్టాక్ రిలీజ్ అని చెప్పింది.
Samayam Telugu xiaomi mi led smart tv 4a next sale on march 16 on flipkart
ఎంఐ టీవీ: నిమిషంలోనే అవుట్ ఆఫ్ స్టాక్..!


అధికారిక వెబ్‌సైట్‌తోపాటు.... ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం ఫ్లిప్‌కార్టు ఇందుకు వేదికలయ్యాయి. 12 గంటలకు ఈ రెండు సైట్లలోకి వెళ్లిన వినియోగదారులు షాక్ తిన్నారు. 12 గంటలకే ఓపెన్ చేయగానే 'అవుట్ ఆఫ్ స్టాక్' అనే టైటిల్ దర్శనమివ్వడంతో అవాక్కయ్యారు. ఒక్క నిమిషంలో ఇలా జరగడమేంటని...? వినియోగదారులు పెదవి విరుస్తున్నారు. మళ్లీ మార్చి 16న మధ్యాహ్నం 12 గంటలకు బుకింగ్ ఉంటుందని సంస్థ ప్రకటించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.