యాప్నగరం

Gold Price: పసిడి పరుగులు.. వెండి వెలుగులు

ఢిల్లీలో 10 గ్రామల 24 క్యారెట్ల బంగారం ధర రూ.31,460 నుంచి రూ.31,850కి పెరిగ్గా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.31,310 నుంచి రూ.31,700కి పెరిగింది.

Samayam Telugu 3 Dec 2018, 6:31 pm
వరసగా నాలుగురోజులపాటు తగ్గిన పసిడి ధరలు సోమవారం (డిసెంబరు 3) పుంజుకున్నాయి. స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్ పెరగడం, అంతర్జాతీయ సానుకూల పరిణామాలతో బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.390 పెరిగింది. దీంతో ఢిల్లీలో 10 గ్రామల 24 క్యారెట్ల బంగారం ధర రూ.31,460 నుంచి రూ.31,850కి పెరిగ్గా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.31,310 నుంచి రూ.31,700కి పెరిగింది. ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.24,700 వద్దే కొనసాగుతోంది.
Samayam Telugu gold


బంగారం బాటలోనే వెండి కూడా పయనించింది. నేటి ట్రేడింగ్‌లో వెండిధర భారీగా పెరిగింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో వెండి ధర రూ.800 పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.36,560 నుంచి రూ.37,360 కి ఎగబాకింది. వారంతపు వెండి ధర రూ .602 తగ్గి రూ .35,749 కి చేరింది. ఇక 100 వెండి నాణేల కొనుగోలు ధర రూ.72,000 ఉండగా.. అమ్మకం ధర రూ.73,000 వద్ద నిలకడగా కొనసాగుతున్నాయి.

అంతర్జాతీయంగా చూస్తే.. న్యూయార్క్‌లో ఔన్స్ బంగారం 1,226.66 డాలర్లకు చేరుకుంది. ఔన్స్ వెండి ధర 14.33 డాలర్లకు చేరుకుంది. అయితే సిల్వర్ నాణేలు కొనుగోలుకు రూ. 72,000 వద్ద నిలిచాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.