యాప్నగరం

ఒక్క రోజు ముచ్చటే.. మళ్లీ పెరిగిన బంగారం ధర

Gold Rates Today | బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ఈరోజు పసిడి రేటు జిగేల్ మంది. నిన్న తగ్గిన గోల్డ్ రేటు ఈరోజు పైకి చేరింది. వెండి ధర మాత్రం తగ్గుతూనే వస్తోంది. సిల్వర్ రేటు మూడు రోజులుగా పడిపోతూనే ఉంది. ఏకంగా రూ.2 వేలకు పైగా క్షీణించింది. వెండి కొనాలనుకునే వారికి ఇది తీపికబురు అని చెప్పుకోవాలి. ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Authored byKhalimastan | Samayam Telugu 22 Apr 2022, 11:28 am

ప్రధానాంశాలు:

  • మళ్లీ పెరిగిన బంగారం ధరలు
  • నిన్న తగ్గిన పసిడి రేట్లు.. ఈరోజు పైపైకి
  • అయితే ఈరోజు కూడా వెలవెలబోయిన వెండి
  • హైదరాబాద్‌లో రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Gold Prices Today: గోల్డ్ రేటు
హైదరాబాద్‌లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. నిన్న దిగివచ్చిన పసిడి రేటు ఈరోజు మళ్లీ పైకి చేరింది. దీంతో తగ్గుదల ఒక్క రోజు ముచ్చటగానే మిగిలింది. ఏప్రిల్ 22న ఆర్నమెంటల్ పసిడి రేటు రూ.150, 24 క్యారెట్ల బంగారం ధర Gold Price రూ.160 మేర పెరిగాయి. దీంతో గోల్డ్ రేట్లు Gold Rate వరుసగా రూ. 49,300కు, రూ.53,780కు చేరాయి. 10 గ్రాములకు ఈ రేట్లు వర్తిస్తాయి. నిన్న బంగారం ధర రూ.700కు పైగా దిగివచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు వెండి మాత్రం తగ్గుతూనే వస్తోంది. ఈరోజు కూడా వెలవెలబోయింది. సిల్వర్ రేటు Silver Rate రూ.300 క్షీణించింది. దీంతో దీని రేటు కేజీకి రూ.73 వేలకు తగ్గింది. సిల్వర్ రేటు తగ్గడం ఇది వరుసగా మూడో రోజు కావడం గమనార్హం. ఈ కాలంలో వెండి ధర ఏకంగా రూ.2,200 మేర పడిపోయింది. ఇకపోతే విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రాంతాల్లో కూడా దాదాపు ఇదే రేట్లు కొనసాగుతున్నాయి.
ఎంసీఎక్స్ మార్కెట్‌లో బంగారం ధరకు రూ.51,100 కీలక మద్దతు స్థాయిగా నిలవొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. వెండి ధరకు రూ.67,400ని మద్దతు స్థాయిగా తెలియజేస్తున్నారు. బంగారం ధరల తగ్గుదల పరిమితంగానే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. రష్యా ఉక్రెయిన్ ఉద్రిక్తతలను ఇందుకు ఉదాహరణగా పేర్కొంటున్నారు. అమెరికా డాలర్ తగ్గడం వల్ల పసిడి, వెండి రేట్లు మళ్లీ పైకి చేరతాయని మెహతా ఈక్విటీస్ వైస్ ప్రెసిడెంట్ (కమోడిటీస్) రాహుల్ కలాంత్రి తెలిపారు.

తక్కువ వృద్ధి, అధిక ద్రవ్యోల్బణం వంటి అంశాలు కూడా బంగారం ధరలకు మద్దతు ఇస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అమెరికా, శ్రీలంక, పాకిస్థాన్ వంటి పలు దేశాల్లో ద్రవ్యోల్బణం భారీగా పెరిగిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలకు 1938- 1928 డాలర్ల వద్ద మద్దతు స్థాయి ఉందని వివరించారు. అలాగే 1962- 1972 డాలర్ల స్థాయి వద్ద నిరోధం ఉందని తెలిపారు. వెండి రేటు విషయానికి వస్తే 24.9- 24.68 డాలర్ల వద్ద మద్దతు ఉందని పేర్కొన్నారు. అలాగే 25.3 - 25.48 డాలర్ల వద్ద నిరోధం ఉందని తెలిపారు. మన కరెన్సీ విలువలో చెప్పుకుంటే రూ.52,420 - రూ. 52,250 వద్ద మద్దతు లభిస్తోందని పేర్కొన్నారు. రూ. 52,950 - రూ. 53,110 వద్ద నిరోధం ఉందన్నారు. వెండి రేటుకు రూ.68.020 - రూ. 67,650 వద్ద మద్దతు, రూ.68,740- రూ. 69,210 వద్ద నిరోధం ఉందని వివరించారు.

Also Read: undefined

Also Read: undefined

‘‘సర్వేలో పాల్గొనండి, ఆకర్షణీయమైన బహుమతిని గెలుపొందే అవకాశం పొందండి’’
20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.