Gold Price Slides By Rs 1000 For The Week, Silver Up
శుభవార్త.. భారీగా పడిపోయిన బంగారం ధర.. షాకిచ్చిన వెండి!
బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇంకేం ఇప్పుడే కొనేయండి. ఎందుకంటే పసిడి ధర మళ్లీ క్రమంగా పైకి కదులుతోంది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి ధర ఇప్పుడు పెరుగుతూ వస్తోంది. బంగారం ధర బాటలోనే వెండి కూడా నడుస్తోంది. ఈ వారం మొత్తంగా చూస్తే బంగారం దిగొచ్చింది. వెండి మాత్రం పెరిగింది.
Samayam Telugu19 Jan 2020, 7:03 am
బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇంకేం ఇప్పుడే కొనేయండి. ఎందుకంటే పసిడి ధర మళ్లీ క్రమంగా పైకి కదులుతోంది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి ధర ఇప్పుడు పెరుగుతూ వస్తోంది. బంగారం ధర బాటలోనే వెండి కూడా నడుస్తోంది. ఈ వారం మొత్తంగా చూస్తే బంగారం దిగొచ్చింది. వెండి మాత్రం పెరిగింది.
పసిడి వెలవెల..
బంగారం ధరలు వారం ప్రాతిపదికన చూస్తే దిగొచ్చాయి. 24 క్యారెట్ల బంగారం ధర ఎక్కువగా పడిపోతే.. 22 క్యారెట్ల బంగారం ధర మాత్రం స్వల్పంగా క్షీణించింది. బంగారం ధర పడిపోతే వెండి ధర మాత్రం పెరిగింది.
అమెరికా-చైనా మధ్య తొలి దశ వాణిజ్య డీల్, అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గిపోవడంతో వారం ఆరంభంలోనే బలహీనంగా ఉన్న పసిడి ధర చివరకు వచ్చేసరికి పుంజుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర పెరగడం సహా దేశీ మార్కెట్లో జువెలర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో బంగారం ధర పైకి కదిలింది. అమెరికా డాలర్తో పోలిస్తే ఇండియన్ రూపాయి పడిపోవడం కూడా బంగారం ధర పెరుగుదలకు దోహదపడింది.
హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఈ వారం దిగొచ్చింది. సోమవారం రూ.42,050 వద్ద ఉన్న బంగారం ధర శనివారం నాటికి రూ.41,050కు తగ్గింది. అంటే రూ.1,000 పడిపోయింది.
అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. అయితే 24 క్యారెట్ల బంగారం స్థాయిలో పడిపోలేదు. వారం ఆరంభంలో రూ.38,200 వద్ద ఉన్న 10 గ్రాముల బంగారం ధర శనివారం నాటికి రూ.రూ.38,090కు చేరింది. అంటే రూ.110 దిగొచ్చింది.
అమెరికా, చైనా మధ్య వాణిజ్య డీల్కు సంబంధించిన తొలి దశ ఒప్పందం కుదిరింది. అయితే ఇన్వెస్టర్లు మాత్రం భిన్నంగా ఆలోచిస్తున్నారు. డీల్ కుదిరినా కూడా ఇంకా పలు అంశాలు అలానే ఉండిపోయాయి. వీటిల్లో ప్రస్తుత టారిఫ్లు కూడా ఒక భాగం. టారిఫ్ల కొనసాగింపు సహా పలు అంశాల విషయంలో ఇన్వెస్టర్లు ఇంకా ఆందోళగానే ఉన్నారు. దీంతో పసిడి ధరపై సానుకూల ప్రభావం పడింది.
బంగారం ధర వెలవెలబోతూ ఉంటే కేజీ వెండి ధర మాత్రం ర్యాలీ చేసింది. వారం ఆరంభంలో రూ.49,150 వద్ద ఉన్న వెండి ధర శనివారం చివరకు వచ్చేసరికి రూ.49,400కు ఎగసింది. అంటే వెండి ధర రూ.250 పైకి కదిలింది.
దేశీ మార్కెట్లో బంగారం ధర గత ఏడాది దాదాపు 25 శాతానికి పైగా పరుగులు పెట్టింది. బంగారంపై దిగుమతి సుంకాల పెంపు, అమెరికా డాలర్తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర పరుగులు పెట్టడం వంటి పలు అంశాలు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.
ప్రస్తుతం బంగారం ధర తగ్గినా కూడా వచ్చే కాలంలో పసిడి రేటు మరింత పెరిగే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు ఇందుకు దోహదపడతాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దేశీయంగా కూడా అమెరికా డాలర్తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడితే.. ఆ అంశం కూడా పసిడి మెరుపులకు కారణంగా నిలవొచ్చని తెలిపారు. బంగారం ధర రానున్న కాలంలో రూ.50,000కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.