యాప్నగరం

Gold Price: బంగారం ధరలు మళ్లీ పెరిగాయి

పసిడి ధరలు పెరగడంతో దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.32,640 కి చేరగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.32,490 కి చేరింది.

Samayam Telugu 29 Dec 2018, 7:15 pm
బులియన్ మార్కెట్‌లో శనివారం (డిసెంబరు 29) బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ సానుకూల పరిణామాలు, స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్ పెరగడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.20 పెరిగి రూ.32,620 నుంచి రూ.32,640 కి చేరింది. మరోవైపు పారశ్రామిక వర్గాల నుంచి, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడంతో కిలోపై రూ.25 తగ్గిన వెండి ధర రూ.39,250 నుంచి రూ.39,225 నుంచి కి పడిపోయింది.
Samayam Telugu gold.


పసిడి ధరలు పెరగడంతో దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.32,640 కి చేరగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.32,490 కి చేరింది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రామలు బంగారం ధర రూ.25,200 వద్ద కొనసాగుతోంది.

బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.39,225 ఉండగా.. వారాంతపు ఆధారిత డెలివరీ ధర 55 రూపాయలు పెరిగి రూ.38,706 కి చేరింది. మరోవైపు 100 వెండి నాణేల కొనుగోలు, అమ్మకం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కొనుగోలు ధర రూ.76,000 ఉండగా.. అమ్మకం ధర రూ.77,000 వద్ద స్థిరపడింది.

అంతర్జాతీయంగా చూస్తే.. న్యూయార్క్ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 1,280.60 డాలర్లు ఉండగా.. వెండి ధర 15.34 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.