యాప్నగరం

Gold Price Today: పసిడి పరుగు ఆగింది

బంగారం ధర పడిపోయినా కూడా వెండి ధర మాత్రం పరుగులు పెట్టింది. రూ.40,000 మార్క్‌ను దాటేసింది.

Samayam Telugu 4 Jan 2019, 5:09 pm
పసిడి మూడు రోజుల లాభాల ర్యాలీ ముగిసింది. ఢిల్లీ మార్కెట్‌లో పది గ్రాముల బంగారం ధర శుక్రవారం రూ.145 నష్టంతో రూ.32,690కి క్షీణించింది. రూపాయితో పోలిస్తే డాలర్ బలహీనపడటం, జువెలర్ల నుంచి ఆదరణ తగ్గడం వంటి అంశాలు బంగారంపై ప్రతికూల ప్రభావం చూపాయని విశ్లేషకులు పేర్కొన్నారు.
Samayam Telugu goldd


బంగారం ధర పడిపోయినా కూడా వెండి ధర మాత్రం పరుగులు పెట్టింది. రూ.40,000 మార్క్‌ను దాటేసింది. పరిశ్రమల నుంచి, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడం సానుకూల ప్రభావం చూపింది. దీంతో కేజీ వెండి ధర రూ.440 పెరుగుదలతో రూ.40,140కు ఎగసింది.

ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.145 క్షీణతతో రూ.32,690కి, 22 క్యారెట్ల బంగారం ధర రూ.145 క్షీణతతో రూ.32,540కి తగ్గింది. ఇక అంతర్జాతీయంగా చూస్తే బంగారం ధర ఔన్స్‌కు 0.11 శాతం క్షీణతతో 1,293.35 వద్ద ట్రేడవుతోంది. గత మూడు రోజుల్లో బంగారం ధర మొత్తంగా రూ.565 మేర పెరిగింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.