యాప్నగరం

స్వల్పంగా పెరిగిన 'పసిడి' ధరలు..

చివరకు 24 క్యారెట్ల ధర రూ.32,650, 22 క్యారెట్ల ధర రూ.32,500 వద్ద ముగిశాయి.

Samayam Telugu 4 Nov 2018, 8:11 am
పండుగ సీజన్ నేపథ్యంలో బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయ్. పసిడి ధర మరోసారి ఆరేళ్ల గరిష్ఠస్థాయి (రూ.32,940) కి చేరువకు వెళ్లి రూ.32,780 వద్ద ట్రేడైంది. అనంతరం రూ.150 తగ్గి రూ.32,650 వద్ద ముగిసింది. అయితే ఓ దశలో 10 గ్రాముల బంగారం 24 క్యారెట్ల ధర రూ.32,550, 22 క్యారెట్ల ధర రూ.32,400 వద్ద ట్రేడ్ అయ్యాయి. కాని డిమాండ్ పెరగడంతో కోలుకున్న బంగారం ధర చివరకు రూ.100 పెరిగింది. చివరకు 24 క్యారెట్ల ధర రూ.32,650, 22 క్యారెట్ల ధర రూ.32,500 వద్ద ముగిశాయి. గత ట్రేడింగ్‌తో పోలిస్తే రూ.20 పెరిగిందన్నమాట. వెండి ధరలు రూ.70 తగ్గి రూ.39,530 వద్ద ముగిసింది.
Samayam Telugu gold


అంతర్జాతీయంగా బంగారం ధరలు స్వల్పంగా పతనమయ్యాయి. సింగపూర్‌లో ఔన్సు బంగారం ధర 1,233.80 డాలర్ల నుంచి 1,233.20 డాలర్లకు దిగొచ్చింది. ఇక వెండి ధర 14.82 డాలర్లుగా ఉంది.

నవంబరు 5న 'ధన్‌తేరాస్', నవంబరు7న దీపావళి నేపథ్యంలో బంగారం ధరలు మరింతగా తగ్గే అవకాశం లేకపోలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.