యాప్నగరం

Gold Rate: స్వల్పంగా తగ్గిన బంగారం.. భారీగా పతనమైన వెండి

పసిడి ధర పడిపోవడంతో ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర రూ.32,450 కి చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర రూ.32,300 కి చేరింది.

Samayam Telugu 27 Dec 2018, 5:17 pm
పసిడి పరుగులకు బ్రేక్ పడింది. బులియన్ మార్కెట్‌లో వరసగా మూడురోజులపాటు పెరుగుతూ వచ్చిన బంగారం ధర గురువారం (డిసెంబరు 27) నాటి ట్రేడింగ్‌లో కాస్త పతనమైంది. గత మూడు సెషన్లలో రూ.400 పెరిగిన బంగారం ధర.. అంతర్జాతీయ బలహీన సంకేతాలు, స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్ మందగించడంతో రూ.50 తగ్గింది. దీంతో దేశరాజధాని ఢిల్లీలో బంగారం ధర రూ.32,500 నుంచి రూ.32,450 కి పడిపోయింది. మరోవైపు వెండి ధర కూడా రూ.525 పతనమైంది. దీంతో బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.38,650 కి చేరింది.
Samayam Telugu gold


పసిడి ధర పడిపోవడంతో ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర రూ.32,450 కి చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర రూ.32,300 వద్ద ముగిసింది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.100 పెరిగి రూ.25,100 గా నమోదైంది. వెండి ధర రూ.38,650 కి చేరగా.. వారాంతపు ఆధారిత డెలివరీ ధర రూ.478 తగ్గడంతో రూ.37,203 కి పడిపోయింది. ఇక 100 వెండి నాణేల కొనుగోలు, అమ్మకం ధర రూ.100 పెరిగింది. దీంతో కొనుగోలు ధర రూ.75,000 ఉండగా.. అమ్మకం ధర రూ.76,000 కి చేరింది.

అంతర్జాతీయంగాను బంగారం ధరలు పెరిగాయి. న్యూయార్క్ మార్కెట్‌లో 0.33 శాతం తగ్గి ఔన్సు బంగాం ధర 1,268.98 డాలర్లకు చేరింది. వెండి ధర 1.07 శాతం పెరిగి ఔన్స్ $ 15.01 డాలర్లకు చేరింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.