యాప్నగరం

Gold price Today: పెరిగిన బంగారం, వెండి ధరలు

పసిడి ధరలు రూ.100 మేర పెరగడంతో దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.31,850 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.రూ.31,700కి చేరింది.

Samayam Telugu 26 Nov 2018, 6:05 pm
Samayam Telugu gold
అంతర్జాతీయ సానుకూల పరిణామాలు, స్థానిక నగల వ్యాపారాల నుంచి డిమాండ్ పెరగడంతో బులియన్ మార్కెట్‌లో బంగారం ధర సోమవారం (నవంబరు 26) రూ.100 పెరిగింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.31,750 నుంచి రూ.31,850కి పెరిగింది. మరోవైపు పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో వెండి ధర రూ.150 పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.37,300 నుంచి రూ.37,450 కి పెరిగింది. వెండి ధర గత ట్రేడింగ్ (నవంబరు 24) రూ.500 తగ్గిన సంగతి తెలిసిందే.

పసిడి ధరలు రూ.100 మేర పెరగడంతో దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.31,850 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.రూ.31,700కి చేరింది. ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.100 పెరిగి రూ.24,800 కి చేరింది. మరోవైపు వారంతపు డెలివరీ ధరలు రూ.209 పెరిగి రూ.36,309 కి చేరింది.100 వెండి నాణేల కొనుగోలు ధర రూ.73,000 ఉండగా.. అమ్మకం ధర రూ.74,000 వద్ద నిలకడగా కొనసాగుతున్నాయి.

ప్రపంచ మార్కెట్‌ను పరిశీలిస్తే.. సింగపూర్‌లో ఔన్సు బంగారం ధర 0.1 శాతం పెరిగి 1,222.74 నుంచి 1,223.31 డాలర్లకు పెరిగింది. అమెరికా ఫ్యూచర్ మార్కెట్లలోనూ 0.1 శాతం పెరిగిన ఔన్సు బంగారం ధర 1,223.80 డాలర్ల వద్ద నిలిచింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.