యాప్నగరం

Gold Rates: ఆగని 'పసిడి' పరుగులు.. వరుసగా మూడోరోజూ పెరిగిన ధరలు

పండుగ సీజన్ కావడంతో పసిడికి ఉండే డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని నగల వ్యాపారులు ఆ మేరకు కొనుగోళ్లను కూడా పెంచారు.

Samayam Telugu 12 Oct 2018, 5:35 pm
వరుసగా మూడోరోజు కూడా 'పసిడి' పరుగులు పెట్టింది. పండగ సీజన్‌ కావడంతో పసిడికి గిరాకీ పెరగడంతో.. బంగారం ధర శుక్రవారం రూ. 32వేల మార్క్‌ను దాటింది. దీంతో బులియన్‌ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.140 పెరిగి రూ.32,120 పలికింది. వెండి ధర కూడా రూ.500 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.39,500కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలోనూ బంగారం, వెండి ధరల్లో పెరుగదల నమోదైంది. న్యూయార్క్‌ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర రూ. 1,224.60 డాలర్లు, ఔన్సు వెండి ధర 14.66 డాలర్లుగా నమోదైంది.
Samayam Telugu gold rates


పండుగ సీజన్ కావడంతో పసిడికి ఉండే డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని నగల వ్యాపారులు ఆ మేరకు కొనుగోళ్లను కూడా పెంచారు. దీనికి తోడు రూపాయితో పోలీస్తే డాలర్‌ విలువ కాస్త క్షీణించడం కూడా బంగారం ధరలు పెరగడానికి కారణమైంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.