యాప్నగరం

Today Gold Rate: భారీగా పెరిగిన బంగారం ధరలు

అమెరికా-చైనా మధ్య వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరినప్పటికీ.. స్థానిక వ్యాపారుల నుంచి పసిడికి డిమాండ్ పెరిగింది.

Samayam Telugu 8 May 2019, 8:19 pm
అక్షయ తృతీయ(మే 7న) రోజు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు బుధవారం (మే 8న) మళ్లీ పుంజుకున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్ పెరగడంతో బుధవారం బులియన్ మార్కెట్‌‌లో 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 180 రూపాయలు పెరిగింది. దీంతో దేశరాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.రూ.32,670 నుంచి రూ.32,850కి ఎగబాకగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.32500 నుంచి రూ.32,680కి చేరింది. బంగారం బాటలోనే వెండి కూడా పయనించింది. వెండి ధర రూ.100 పెరగడంతో కిలో వెండి ధర రూ.38,120 నుంచి రూ.38,220కి చేరింది.
Samayam Telugu gold rate


తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలను పరిశీలిస్తే హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.32390 వద్ద.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.30,170 వద్ద కొనసాగుతున్నాయి. విజయవాడలోనూ ఇవే ధరలు ఉన్నాయి. కిలో వెండి ధర రూ.40,220 వద్ద కొనసాగుతోంది.

అమెరికా-చైనా మధ్య వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరినప్పటికీ.. స్థానిక వ్యాపారుల నుంచి పసిడికి డిమాండ్ పెరిగింది. న్యూయార్క్‌లో ఔన్సు బంగారం ధర స్వల్పంగా పెరిగి 1288.20 డాలర్ల వద్ద ఉండగా.. ఔన్సు వెండి ధర 14.99 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.26,400 స్థాయిలో ఉంది. కిలో వెండి ధర రూ.38,220 వద్ద కొనసాగుతుండగా.. వారంతపు డెలివరీ వెండి ధర రూ.228 పెరిగి రూ.37,106కి చేరింది. 100 వెండి నాణేల కొనుగోలు ధర రూ.79,000 వద్ద, అమ్మకం ధర రూ.80,000 వద్దే కొనసాగుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.