శుభవార్త.. రెండో రోజూ పడిపోయిన బంగారం, వెండి ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇలా!
బంగారం ధర పడిపోయింది. పసిడి రేటు వరుసగా రెండో రోజు కూడా నేలచూపులు చూసింది. బంగారం ధర దిగివస్తే.. వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. ఆల్టైమ్ గరిష్ట స్థాయి నుంచి చూస్తే పసిడి ఇంకా రూ.10 వేలు కిందనే ఉంది.
Samayam Telugu 12 Apr 2021, 4:07 pm
ప్రధానాంశాలు:
- బంగారం ధర నేలచూపులు
- వెండి కూడా కిందకే
- వరుసగా రెండో రోజూ డౌన్
బంగారం ధర నేలచూపులు చూస్తోంది. వెలవెలబోతూనే వస్తోంది. అమెరికా మార్కెట్లో బాండ్ ఈల్డ్స్ పెరిగడం వల్ల బంగారం ధరపై ప్రతికూల ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో బంగారం ధర వరుసగా రెండో రోజు కూడా పడిపోయిందని చెప్పుకోవచ్చు. ఎంసీఎక్స్ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ధర సోమవారం 0.03 శాతం తగ్గింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.46,80కు దిగొచ్చింది. బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా నడిచింది. వెండి ధర కేజీకి 0.15 శాతం క్షీణతతో రూ.66,884కు పడిపోయింది. గత సెషన్లో బంగారం ధర 0.5 శాతం తగ్గింది.
Also Read: undefined
ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరకు రూ.44,940 వద్ద మద్దతు ఉందని, అలాగే రూ.47,380 వద్ద నిరోధం ఉందని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ జియోజిత్ తెలిపింది. భారత్లో బంగారం ధర ఇటీవల రూ.44,000 స్థాయికి పడిపోయింది. ఇది ఏడాది కనిష్ట స్థాయి. అయితే మళ్లీ ఈ స్థాయి నుంచి పసిడి పైకి కదిలింది.
ఇకపోతే బంగారం ధర గత ఏడాది ఆగస్ట్ నెలలో ఏకంగా ఆల్టైమ్ గరిష్టాన్ని తాకింది. 10 గ్రాములకు రూ.56,200 స్థాయికి పరగులు పెట్టింది. అయితే బంగారం ధర తర్వాత అదే స్థాయిలో కొనసాగలేకపోయింది. క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. అక్కడి నుంచి చూస్తే బంగారం ధర ఇప్పుడు రూ.10 వేలు పడిపోయింది.
Also Read: undefined
ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరకు రూ.44,940 వద్ద మద్దతు ఉందని, అలాగే రూ.47,380 వద్ద నిరోధం ఉందని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ జియోజిత్ తెలిపింది. భారత్లో బంగారం ధర ఇటీవల రూ.44,000 స్థాయికి పడిపోయింది. ఇది ఏడాది కనిష్ట స్థాయి. అయితే మళ్లీ ఈ స్థాయి నుంచి పసిడి పైకి కదిలింది.
ఇకపోతే బంగారం ధర గత ఏడాది ఆగస్ట్ నెలలో ఏకంగా ఆల్టైమ్ గరిష్టాన్ని తాకింది. 10 గ్రాములకు రూ.56,200 స్థాయికి పరగులు పెట్టింది. అయితే బంగారం ధర తర్వాత అదే స్థాయిలో కొనసాగలేకపోయింది. క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. అక్కడి నుంచి చూస్తే బంగారం ధర ఇప్పుడు రూ.10 వేలు పడిపోయింది.