యాప్నగరం

వామ్మో.. ఏకంగా రూ.1,700 పెరిగిన బంగారం ధర.. లేటెస్ట్ రేట్లు ఇవే!

బంగారం ధర పరుగులు పెడుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పెరగడం ఇందుకు ప్రధాన కారణం. బాగ్దాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై అమెరికా డ్రోన్ దాడిలో ఇరాన్‌‌ మిలిటరీ అధికారి మరణించడంతో పసిడి మెరుపులు మొదలయ్యాయి. ఈ రాకెట్ దాడిలో ఇరాన్‌ నిఘా విభాగాధిపతి ఖాసీం సులేమన్‌ ప్రాణాలు కోల్పోయారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఈ ఉద్రిక్తతల వల్ల ఇన్వెస్టర్లు పసిడి వైపు మొగ్గుచూపుతున్నారు.

Samayam Telugu 3 Jan 2020, 12:30 pm
బంగారం ధర పరుగులు పెడుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పెరగడం ఇందుకు ప్రధాన కారణం. బాగ్దాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై అమెరికా డ్రోన్ దాడిలో ఇరాన్‌‌ మిలిటరీ అధికారి మరణించడంతో పసిడి మెరుపులు మొదలయ్యాయి. ఈ రాకెట్ దాడిలో ఇరాన్‌ నిఘా విభాగాధిపతి ఖాసీం సులేమన్‌ ప్రాణాలు కోల్పోయారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఈ ఉద్రిక్తతల వల్ల ఇన్వెస్టర్లు పసిడి వైపు మొగ్గుచూపుతున్నారు.
Samayam Telugu gold rates surge today jump rs 1700 per 10 gram in just 2 weeks
వామ్మో.. ఏకంగా రూ.1,700 పెరిగిన బంగారం ధర.. లేటెస్ట్ రేట్లు ఇవే!


దేశీ మార్కెట్‌లో

గ్లోబల్ మార్కెట్‌లో ధరల పెరుగుదల కారణంగా దేశీ మార్కెట్‌లోనూ పసిడి జోరుమీదుంది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ ధర ఈ రోజు 1 శాతానికి పైగా పెరిగింది. రూ.400 పెరుగుదలతో 10 గ్రాములకు రూ.39,680 స్థాయికి చేరింది.

Also Read: శుభవార్త.. పడిపోయిన బంగారం ధర.. ఎంతంటే?

2 వారాల్లో రూ.1,700 జంప్

ఎంసీఎక్స్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర గత రెండు వారాల్లో ఏకంగా రూ.1,700 పరుగులు పెట్టింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి పడిపోవడం, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం వంటి అంశాలు ఇందుకు ప్రధాన కారణం.

Also Read: ఈఎంఐ లేకుండా రుణం.. ప్రతి నెలా వడ్డీ చెల్లిస్తే చాలు!

వెండి కూడా పైపైకే

బంగారం ధర బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ ధర ఈ రోజు 0.8 శాతం పెరుగుదలతో కేజీకి రూ.47,384 స్థాయికి చేరింది. ‘బంగారం ధర రూ.39,500 వద్ద సపోర్ట్ తీసుకోవచ్చు. తర్వాత రూ.40,000 దిశగా కదిలే ఛాన్స్ ఉంది. వెండికి కూడా రూ.47,200 వద్ద మద్దతు లభించొచ్చు. తర్వాత రూ.48,000 స్థాయికి పెరగొచ్చు’ అని ఎస్ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్ పేర్కొంది.

Also Read: క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్నారా? ఈ 5 తప్పులు చేయొద్దు!

4 నెలల గరిష్టానికి

బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్‌లో పరుగులు పెడుతోంది. బంగారం ధర ఔన్స్‌కు 1.05 శాతం పెరుగుదలతో 1544.15 డాలర్ల స్థాయికి చేరింది. ఇది నాలుగు నెలల గరిష్ట స్థాయి. ఇరాన్, అమెరికా ఉద్రిక్తతలు ఇందుకు ప్రధాన కారణం. వెండి ధర కూడా ఔన్స్‌కు 0.98 శాతం పెరుగుదలతో 18.22 డాలర్లకు చేరింది.

Also Read: రూ.10,000తో రూ.2 కోట్లు ఎలా సంపాదించాలి? ఇలా చేయండి!

పసిడిపై వీటి ఎఫెక్ట్

బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.