యాప్నగరం

Gold Price Today : మళ్లీ మెరిసిన బంగారం, తులం ఎంత పెరిగిందంటే..?

దేశవ్యాప్తంగా బంగారం ధరలు మెరుస్తున్నాయి. రెండు రోజులుగా బంగారం ధరలలో పెరుగుదల నమోదవుతోంది. డాలర్ ఇండెక్స్ బలహీనపడటంతో ఈ విలువైన యెల్లో మెటల్ మెరుస్తోంది. బంగారం మెరిసిన ఈ సమయంలో వెండి స్తబ్దుగా ఉంది. వారం లెక్కన చూసుకున్నా బంగారం ధర రూ.800 మేర మెరిగింది. ఈ రోజు ఒక్క రోజే రూ.350 మేర ధర పెరుగుదల నమోదైంది. నేటి మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఓసారి చూద్దాం...

Authored byKoteru Sravani | Samayam Telugu 22 May 2022, 6:25 am
Samayam Telugu Gold Price Today
Gold Price Today: బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్లకు చెందిన తులం బంగారం ధరపై రూ.350 పెరగడంతో.. ఈ రేటు రూ.47,050కు చేరుకుంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన బంగారంపై కూడా రూ.380 పెరగడంతో.. ఈ ధర రూ.51,330కు పెరిగింది. బంగారం ధరలు ఈ రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ 20 ఏళ్ల గరిష్ట స్థాయిల నుంచి కిందకి చూడటం ప్రారంభించడంతో... బంగారం ధరకు ఊపు వచ్చింది. ఈ వారం మొత్తం మీద కూడా 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.46,250 నుంచి రూ.47,050కు పెరిగింది. అంటే రూ.800 మేర ఈ ధర ఎగిసింది. ఇక పోతే హైదరాబాద్ మార్కెట్లో సిల్వర్ రేటు స్థిరంగా ఉంది. కేజీ వెండి ధర నేడు రూ.65,900గా నమోదైంది.

హైదరాబాద్‌తో పాటు విజయవాడ మార్కెట్లో కూడా బంగారం ధరలు(gold price Today) మెరిశాయి. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.350 పెరిగి రూ.47,050కు చేరుకుంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.380 పెరగడంతో.. ఈ ధర రూ.51,330గా నమోదైంది. వెండి ధరలు విజయవాడలో కూడా స్థిరంగా ఉన్నాయి. కేజీ వెండి రేటు రూ. 65,900 వద్ద స్థిరంగా పలికింది.

దేశ రాజధాని ఢిల్లీలో వెండి రేటు రూ.300 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర దేశ రాజధానిలో రూ.61,400కు దిగొచ్చింది. అలాగే 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.350 పెరిగి రూ.47,050కు ఎగిసింది. 24 క్యారెట్లకు చెందిన బంగారం ధరపై కూడా రూ.380 పెరగడంతో.. ఈ రేటు రూ.51,330గా నమోదైంది. ఢిల్లీతో పాటు చెన్నై, బెంగళూరు, ముంబై మార్కెట్లలోనూ బంగారం ధరలు పెరిగాయి.

అమెరికా డాలర్ ఇండెక్స్ తగ్గడం, రూపాయి వాల్యూ పడిపోవడం, గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లలో ఒడిదుడుకులు ఈ యెల్లో మెటల్‌ను మళ్లీ మెరిసేలా చేస్తున్నాయి. మళ్లీ బంగారం ధరలు పెరుగుతూ వస్తాయి. ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం రూ.50,845గా ఉన్న 10 గ్రాముల బంగారం ధర రూ.52,100కు ఎగుస్తుందని ట్రేడర్లు అంటున్నారు.

Also Read : అమ్మకానికి మెట్రో స్టోర్లు.. పోటీపడుతోన్న దిగ్గజ గ్రూప్‌లు, ఎవరికి దక్కేనో..?
20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.