యాప్నగరం

Gold Rate Today: కొండెక్కిన బంగారం, వెండి ధరలు.. ఒక్క రోజులోనే ఏకంగా రూ.1,500 మేర జంప్!

Gold Rate Today: బంగారం ధరలు కొండెక్కాయి. వెండి తళుక్కుమంది. నేడు బులియన్ మార్కెట్లో ఈ విలువైన మెటల్స్ ధరలు భారీగా పెరిగాయి. ఇన్ని రోజులు ధరలు తగ్గుతూ కొనుగోలుదారులకు ఆకర్షణీయంగా ఉన్న ఈ విలువైన మెటల్స్.. ప్రస్తుతం భారీ పెరుగుదలను నమోదు చేశాయి. ఏకంగా ఒక్క రోజే వెండి రేటు రూ.1,500 మేర పెరిగింది. బంగారం ధర పెరుగుదల కూడా భారీగానే ఉంది. ఒక్కసారిగా బంగారం ధరలు భారీగా పెరగడం వినియోగదారులకు షాకిచ్చినట్టయింది.

Authored byKoteru Sravani | Samayam Telugu 30 Sep 2022, 6:50 am

ప్రధానాంశాలు:

  • కొండెక్కిన బంగారం ధరలు
  • తళుక్కుమన్న వెండి రేట్లు
  • ఏకంగా రూ.1,500 మేర పెరిగిన వెండి
  • వినియోగదారులకు షాకిచ్చిన ధరలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Gold Rate Today
భారీగా పెరిగిన బంగారం
Gold Rate Today: బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఒక్క రోజులోనే ఈ రేట్లు కొండెక్కి కూర్చున్నాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన ధరలు ఇవాళ మాత్రం కొనుగోలుదారులకు షాకిచ్చాయి. తులం రూ.46 వేలపైకి చేరుకుంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.600 పెరిగి రూ.46,400గా రికార్డయింది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.650 పెరిగి రూ.50,620గా నమోదైంది. బంగారంతో పాటు వెండి రేటు కూడా భగ్గుమంది. వెండి రేటు ఏకంగా ఒక్క రోజే రూ.1,500 మేర పెరిగి.. కేజీ రూ.61,500కు చేరుకుంది.
అటు దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం, వెండి ధరలు మెరిశాయి. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర ఢిల్లీలో రూ.600 పెరిగి రూ.46,550గా నమోదైంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.650 పెరిగి రూ.50,780గా రికార్డయింది. ఢిల్లీలో బంగారంతో పాటు వెండి రేటు కూడా భారీగా పెరిగింది. కేజీ వెండి రేటు రూ.1,400 మేర పెరిగి, రూ.56,400కు చేరుకుంది.

విజయవాడ మార్కెట్లో కూడా బంగారం, వెండి ధరల పెరుగుదల ఇదే స్థాయిలో ఉంది. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర విజయవాడలో రూ.600 పెరిగి రూ.46,400కు చేరుకుంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.650 పెరిగి రూ.50,620గా రికార్డయింది. బంగారంతో పాటు వెండి రేటు కూడా విజయవాడలో తళుక్కుమంది. వెండి రేటు ఏకంగా ఒక్క రోజే రూ.1,500 మేర పెరిగి.. కేజీ రూ.61,500కు చేరుకుంది.

Also Read : ఒక షేరు కొంటే 6 సార్లు ఉచితం... దసరా పండక్కి ఆ కంపెనీ ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్!
నవరాత్రి పండగ సీజన్‌లో బంగారం, వెండికి డిమాండ్ ఎక్కువగా వస్తోన్న నేపథ్యంలో ధరలు పెరుగుతున్నాయి. అంతేకాక డాలర్ ధర కాస్త తగ్గడంతో.. బంగారం ధరలలో గురువారం రిలీఫ్ ర్యాలీ కనిపించింది. ఇవన్ని దేశీయంగా బులియన్ మార్కెట్లో రేట్లు పెరుగుదలకు కారణంగా నిలిచాయి.

అయితే మార్చి నాటి స్థాయి ఔన్స్ 2000 డాలర్లతో పోలిస్తే.. బంగారం ధరలు ప్రస్తుతం 20 శాతం వరకు తగ్గిపోయాయి. కేంద్ర బ్యాంకులు తమ మానిటరీ పాలసీ విధానాలను కఠినతరం చేస్తుండటంతో.. బంగారం తక్కువ ఆకర్షణీయంగా మారి, డాలర్ వాల్యూ గరిష్ట స్థాయిలకు పెరిగింది.

Also Read : కుప్పకూలుతున్న స్టాక్ మార్కెట్లు.. వరుసగా ఏడో సెషన్‌లో కిందికే.. ఆశలన్నీ ఇక ఆర్‌బీఐ ప్రకటనపైనే!

20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.