యాప్నగరం

బంగారం కొంటున్నారా? ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి!

భారతీయులకు పసిడి‌పై మక్కువ ఎక్కువ. అందుకే బంగారం తెగ కొనేస్తుంటారు. పండుగ సీజన్, పెళ్లిళ్లు వంటివి వస్తే పసడి డిమాండ్ పెరుగుతుంది. భారత్‌లో బంగారానికి సంబంధించి నిర్దిష్టమైన పాలసీ అంటూ ఏమీ లేదు. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే మోదీ సర్కార్ బంగారు నగలకు హాల్‌మార్క్ తప్పనిసరి రూల్‌ను తీసుకురాబోతోంది.

Samayam Telugu 11 Aug 2020, 6:18 pm
భారతీయులకు పసిడి‌పై మక్కువ ఎక్కువ. అందుకే బంగారం తెగ కొనేస్తుంటారు. పండుగ సీజన్, పెళ్లిళ్లు వంటివి వస్తే పసడి డిమాండ్ పెరుగుతుంది. భారత్‌లో బంగారానికి సంబంధించి నిర్దిష్టమైన పాలసీ అంటూ ఏమీ లేదు. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే మోదీ సర్కార్ బంగారు నగలకు హాల్‌మార్క్ తప్పనిసరి రూల్‌ను తీసుకురాబోతోంది.
Samayam Telugu hallmarking to be mandatory for gold jewellery from january 2021 ram vilas paswan
బంగారం కొంటున్నారా? ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి!


gold price et

ఎప్పటి నుంచి అమలులోకి?

దేశంలో విక్రయించే బంగారు ఆభరణాలరే హాల్‌ మార్కింగ్‌ ధ్రువీకరణ 2021 నుంచి అమలులోకి రానుంది. గోల్డ్ జువెలరీకి హాల్ మార్క్ తప్పనిసరి చేస్తామని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ ప్రకటించారు. దీనికి సంబంధించి వచ్చే జనవరి 15న నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని తెలిపారు.

Also Read: పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?

హాల్‌మార్క్ లేని ఆభరణాల సంగతేంటి?

కేంద్ర ప్రభుత్వం బంగారు ఆభరణాలు విక్రయించే వ్యాపారులు, సంస్థలకు ఏడాది గడువు ఇచ్చింది. ఈలోపు వారి వల్ల ఉన్న హాల్‌మార్క్‌లేని ఆభరణాలను, స్టాక్‌ను ఖాళీ చేసుకోవలసి ఉంటుంది. అలాగే బంగారం వర్తకులు భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్‌) వద్ద తప్పనిసరిగా రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. వీరంతా 2021 జనవరి 15 నుంచి కేవలం హాల్‌మార్క్‌తో కూడిన ఆభరణాలనే విక్రయించాల్సిందే.

Also Read: పీఎఫ్ అకౌంట్ ఉందా? ఇలా చేస్తే 90 శాతం డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు!

హాల్‌మార్క్ లేకపోతే?

వ్యాపారులు హాల్ మార్క్ లేనటువంటి నగలు విక్రయిస్తే రూ.లక్ష నుంచి జరిమానా పడుతుంది. అలాగే సంవత్సరం పాటు జైలు శిక్ష కూడా తప్పదు. ఒక బంగారు ఆభరణానికి హాల్‌మార్క్‌ వేసేందుకు రూ.50 ఛార్జి అవుతుంది. అంతేకాకుండా విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే నగలకు కూడా హాల్‌మార్క్‌ తప్పనిసరి. అలాగే బంగారు వ్యాపారులు ఇకపై 14, 18, 22 క్యారెట్ల బంగారు నగలు మాత్రమే విక్రయిస్తారు. ప్రతి జువెలరీ షాపులో... పై మూడు రకాల క్యారెట్ల నగల రేట్లను బోర్డులో చూపించాల్సి ఉంటుంది. ఒక్కో కస్టమర్‌కి ఒక్కో రేట్ చెబితే కుదరదు.

Also Read: హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నారా? ఈ పెనాల్టీలు తెలుసుకోండి!

పాత బంగారు ఆభరణాల పరిస్థితి ఏంటి?

ఇకపోతే ఇప్పటికే వినియోగంలో ఉన్న ఆభరణాల జోలికి తాము వెళ్లబోమని మంత్రి పాశ్వాన్‌ స్పష్టం చేశారు. హాల్‌మార్కింగ్‌ తప్పనిసరికి సంబంధించిన ముసాయిదా ఆదేశాలను అభిప్రాయాల కోసం ప్రపంచ వాణిజ్య మండలి (WTO) వెబ్‌సైట్‌లో అక్టోబర్‌ 10న ఉంచామని చెప్పారు. అభిప్రాయాలు తెలియజేసేందుకు 60 రోజుల గడువు ఉంటుందన్నారు.

ఈ రోజు పసిడి పైకి

ఇకపోతే పసిడి ధర ఈరోజు పెరిగింది. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.120 పైకి కదిలింది. దీంతో ధర రూ.39,510కు ఎగసింది. అంతర్జాతీయంగా బలమైన ట్రెండ్ సహా దేశీ జువెలర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు కారణమని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.

గ్లోబల్ మార్కెట్‌లోనూ ఇదే పరిస్థితి

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. ఔన్స్‌కు 0.65 శాతం పెరుగుదలతో 1,470.30 డాలర్లకు చేరింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 0.28 శాతం పెరుగుదలతో 17.10 డాలర్లకు ఎగసింది. బంగారం ధర నిన్న కూడా పెరగడం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.