యాప్నగరం

అక్షయ తృతీయ : ఈ బ్యాంగిల్స్ భలేగున్నాయ్!

అక్షయ తృతీయ సందడి మొదలైంది. కొత్త కొత్త డిజైన్లతో బంగారం షాపులు కస్టమర్ల ముందుకు వస్తున్నాయి. మే 3వ తేదీని అక్షయ తృతీయ కావడంతో ఇప్పటి నుంచే ఆఫర్లను, కొత్త డిజైన్లను ప్రవేశపెట్టడం మొదలు పెట్టాయి గోల్డ్ జ్యూవెల్లరీ షాపులు. పెద్ద పెద్ద బంగారం షాపుల నుంచి చిన్న దుకాణాల వరకు రకరకాల డిజైన్లను తీసుకొస్తున్నాయి. తాజాగా ప్రముఖ జ్యూవెల్లరీ బ్రాండ్లలో ఒకటైన తనిష్క్ కూడా సరికొత్త బ్యాంగిల్ డిజైన్లను ప్రవేశపెట్టింది. అంతేకాక అక్షయ తృతీయ రోజు వినియోగదారులు ఇబ్బందులు పడకుండా పలు సర్వీసులను లాంచ్ చేసింది.

Authored byKoteru Sravani | Samayam Telugu 29 Apr 2022, 7:32 am

ప్రధానాంశాలు:

  • మొదలైన అక్షయ తృతీయ సందడి
  • కొత్త కొత్త డిజైన్లతో కస్టమర్లను మురిపిస్తోన్న దుకాణాలు
  • ఆకర్షణీయమైన ఆఫర్లతో ముందుకి
  • తనిష్క్ సరికొత్త బ్యాంగిల్ డిజైన్లు విడుదల
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Tanishq bangle
బంగారం దుకాణాలలో అక్షయ తృతీయ సందడి మొదలైంది. లక్ష్మీ కటాక్షం పొందాలంటే అక్షయ తృతీయ బంగారం కొనాలన్నది ప్రజల నమ్మకం. అందుకే డబ్బులున్నా లేకపోయినా కొందరు ఆ రోజు బంగారాన్ని కొంటారు. ఇక బంగారం దుకాణాలు కూడా అక్షయ తృతీయ కొత్త కొత్త డిజైన్లలో కస్టమర్లను మైమరిపిస్తుంటాయి. ఈ అక్షయ తృతీయ సందర్భంగా భారత్‌లో ప్రముఖ జ్యూవెల్లరీ బ్రాండ్లలో ఒకటైన తనిష్క్.. సరికొత్త బ్యాంగిల్ డిజైన్స్‌ను ప్రవేశపెట్టింది. అంతేకాక ఆకర్షణీయమైన ఆఫర్లను కూడా ఈ సందర్భంగా తీసుకొచ్చింది. ఏ గోల్డ్ జ్యూవెల్లరీ కొన్నా.. ఒక్కో గ్రాముపై రూ.200 వరకు తగ్గింపును తనిష్క్ ప్రకటించింది. డైమండ్ జ్యూవెల్లరీపై 20 శాతం వరకు తగ్గింపును ఇస్తుంది. అయితే ఈ ఆఫర్ కొద్ది కాలం మాత్రమే. 18 క్యారెట్ల నుంచి 22 క్యారెట్ల మధ్యలో ఈ గోల్డ్ బ్యాంగిల్స్ ఉన్నాయి.


అక్షయ తృతీయ సందర్భంగా తనిష్క్ గోల్డ్ కాయిన్ ఏటీఎం ‘24కే ఎక్స్‌ప్రెస్’ను లాంచ్ చేసింది. దీని ద్వారా గోల్డ్ కాయిన్లను సౌకర్యవంతంగా కొనుగోలు చేసుకునేలా అవకాశం కల్పిస్తోంది. ‘24కే ఎక్స్‌ప్రెస్’ గోల్డ్ కాయిన్ ఏటీఎం ఫెసిలిటీ ఎంపిక చేసిన మార్కెట్లలో తనిష్క్ ఫ్లాగ్‌షిప్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది.



అత్యధికంగా ఉన్న బంగాం ధరలు కొనుగోళ్లను దెబ్బకొట్టవని తనిష్క్ చెప్పింది. చాలా మంది కస్టమర్లు ఈ ఫెస్టివ్ సీజన్‌లో బంగారం కొనేందుకు ఆసక్తిగా ఉన్నారని తెలిపింది. అత్యధికంగా ఉన్న ధరలను దృష్టిలో పెట్టుకుని, ‘Hi-Lites’ ప్లాట్‌ఫామ్‌ను తనిష్క్ ప్రవేశపెట్టింది. దీని ద్వారా తక్కువ ధరలో సేమ్ లుక్‌లో తక్కువ బరువులో ఉండే ఆభరణాలను ఆఫర్ చేస్తోంది.

అక్షయ తృతీయ సందర్భంగా డిజిటల్ పేమెంట్ కంపెనీ ఫోన్‌పే కూడా బంగారం, వెండి కొనుగోళ్లపై ఆకర్షణీయమైన ఆఫర్లను తీసుకొచ్చింది. ఈ ఆఫర్ కాలంలో బంగారం కొనుగోలు చేస్తే రూ.2,500 వరకు క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్ చేస్తోంది. అలాగే సిల్వర్ కాయిన్ల లేదా బార్ల కొనుగోలుపై రూ.250 వరకు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది.

Also Read : మహిళలకు శుభవార్త.. భారీగా దిగొచ్చిన బంగారం ధరలు20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.