యాప్నగరం

Today Gold Rate: శుభవార్త.. దిగొచ్చిన బంగారం ధర.. వెండి వెలవెల!

పసిడి ధర మళ్లీ పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.40 తగ్గింది. దీంతో ధర రూ.39,170కు క్షీణించింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ సహా కూడా దేశీ జువెలర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు కారణమని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.

Samayam Telugu 11 Aug 2020, 3:49 pm
పసిడి ధర మళ్లీ పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.40 తగ్గింది. దీంతో ధర రూ.39,170కు క్షీణించింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ సహా కూడా దేశీ జువెలర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు కారణమని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
Samayam Telugu today 22ct 24ct gold silver price in hyderabad 12th december 2019
Today Gold Rate: శుభవార్త.. దిగొచ్చిన బంగారం ధర.. వెండి వెలవెల!


వెండిదీ ఇదే దారి

అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.30 పడిపోయింది. దీంతో ధర రూ.35,910కు తగ్గింది. ఇకపోతే బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.90 దిగొచ్చింది. దీంతో వెండి ధర రూ.47,400కు తగ్గింది.

Also Read: గుడ్ న్యూస్.. పడిపోయిన బంగారం ధర.. షాకిచ్చిన వెండి!

దేశ రాజధానిలోనూ ట్రెండ్ రివర్స్

ఢిల్లీ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర పరిస్థితి వేరేలా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. రూ.37,900 వద్దనే కొనసాగుతోంది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర స్థిరంగా ఉంది. రూ.36,700 వద్దనే నిలకడగా కొనసాగుతోంది. పసిడి నిలకడగా ఉంటే వెండి ధర మాత్రం పడిపోయింది. ధర కేజీకి రూ.90 తగ్గుదలతో రూ.47,400కు తగ్గింది.

6 ఏళ్ల గరిష్ట స్థాయికి

ఇకపోతే గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర సెప్టెంబర్ నెలల్లో ఏకంగా ఆరేళ్ల గరిష్ట స్థాయి (ఔన్స్‌కు 1,550 డాలర్లకు) చేరిన విషయం తెలిసిందే. అమెరికా, చైనా మధ్య నెలకొన్ని వాణిజ్య ఉద్రిక్తతలు ఇందుకు కారణం. అయితే అప్పటితో పోలిస్తే ఇప్పుడు బంగారం ధర కింది స్థాయిల్లోనే కదలాడుతోంది.

చైనాతో డీల్ ఎఫెక్ట్ కారణం

సాధారణంగా ఈ ఏడాది చివరికల్లా చైనాతో అమెరికా వాణిజ్య డీల్ ఓకే కావొచ్చనే అంచనాలు ఇప్పటిదాకా కొనసాగుతూ వచ్చాయి. డిసెంబర్ 15 నుంచి చైనా దిగుమతులపై అమెరికా కొత్త టారిఫ్‌లు అమలులోకి రానున్నాయి. ఈలోపు డీల్ ఓకే కావొచ్చని అందరూ భావిస్తున్నారు. అందుకే బంగారంపై ప్రతికూల ప్రభావం పడింది.

Also Read: క్రెడిట్ కార్డు ఉందా? మీకు 11 లాభాలు.. అవేంటో తెలుసుకోండి!

19 శాతం ర్యాలీ

మరోవైపు దేశీ మార్కెట్‌లో బంగారం ధర ఈ ఏడాది దాదాపు 19 శాతం పరుగులు పెట్టింది. బంగారంపై దిగుమతి సుంకాల పెంపు, అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పరుగులు పెట్టడం వంటి పలు అంశాలు ఇందుకు ప్రధాన కారణం.

Also Read: ఓరినాయనో.. రూ.800 పతనమైన బంగారం ధర..!

పసిడి ధరపై వీటి ప్రభావం

బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.