Today 22ct 24ct Gold Silver Price In Hyderabad 13th December 2019
Today Gold Rate: శుభవార్త.. భారీగా పడిపోయిన వెండి.. షాకిచ్చిన బంగారం ధర!
పసిడి ధర తగ్గుదలకు బ్రేకులు పడ్డాయి. హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.180 పెరిగింది. దీంతో ధర రూ.39,350కు చేరింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ ఉన్నా కూడా దేశీ జువెలర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు కారణమని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
Samayam Telugu11 Aug 2020, 3:52 pm
పసిడి ధర తగ్గుదలకు బ్రేకులు పడ్డాయి. హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.180 పెరిగింది. దీంతో ధర రూ.39,350కు చేరింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ ఉన్నా కూడా దేశీ జువెలర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు కారణమని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
వెండి వెలవెల
అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.180 పరుగులు పెట్టింది. దీంతో ధర రూ.36,090కు చేరింది. ఇకపోతే బంగారం ధర పెరిగితే.. వెండి ధర మాత్రం పడిపోయింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.750 దిగొచ్చింది. దీంతో వెండి ధర రూ.46,650కు తగ్గింది.
ఢిల్లీ మార్కెట్లో కూడా బంగారం ధర పరిస్థితి ఇలానే ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.150 పెరుగుదలతో రూ.38,050కు ఎగసింది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.150 పెరిగింది. దీంతో ధర రూ.36,850కు చేరింది. పసిడి పెరిగితే వెండి ధర మాత్రం పడిపోయింది. ధర కేజీకి రూ.750 తగ్గుదలతో రూ.46,650కు తగ్గింది.
గ్లోబల్ మార్కెట్లో..
ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గింది. ఔన్స్కు 0.11 శాతం తగ్గుదలతో 1,470.65 డాలర్లకు క్షీణించింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్కు 0.05 శాతం పెరుగుదలతో 16.95 డాలర్లకు ఎగసింది.
ఇకపోతే గ్లోబల్ మార్కెట్లో బంగారం ధర సెప్టెంబర్ నెలల్లో ఏకంగా ఆరేళ్ల గరిష్ట స్థాయి (ఔన్స్కు 1,550 డాలర్లకు) చేరిన విషయం తెలిసిందే. అమెరికా, చైనా మధ్య నెలకొన్ని వాణిజ్య ఉద్రిక్తతలు ఇందుకు కారణం. అయితే అప్పటితో పోలిస్తే ఇప్పుడు బంగారం ధర కింది స్థాయిల్లోనే కదలాడుతోంది.
Twitter-Getting VERY close to a BIG DEAL with China. They ...
ఫెడ్ జోష్
అంతర్జాతీయ ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఇప్పుడు అమెరికా ఫెడరల్ రిజర్వు మీటింగ్పైనే దృష్టి కేంద్రీకరించారు. ఫెడ్ రెండు రోజుల మీటింగ్ అనంతరం రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్న ప్రకటించింది. దీంతో పసిడిపై కొంత మేర సానుకూల ప్రభావం పడింది. అందుకే ధర పైకి కదిలింది. ఇప్పుడు ఫెడ్ రేటు 1.5 శాతం నుంచి 1.75 శాతం మధ్యలో ఉంది.
మరోవైపు దేశీ మార్కెట్లో బంగారం ధర ఈ ఏడాది దాదాపు 19 శాతం పరుగులు పెట్టింది. బంగారంపై దిగుమతి సుంకాల పెంపు, అమెరికా డాలర్తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర పరుగులు పెట్టడం వంటి పలు అంశాలు ఇందుకు ప్రధాన కారణం.
పసిడి ధరపై వీటి ప్రభావం
బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.