యాప్నగరం

Today Gold Rate: గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం ధర.. వెండి ఝలక్!

పసిడి ధర మళ్లీ తగ్గింది. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.160 దిగొచ్చింది. దీంతో ధర రూ.39,190కు క్షీణించింది. అంతర్జాతీయంగా బలమైన ట్రెండ్ ఉన్నా కూడా దేశీ జువెలర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు కారణమని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.

Samayam Telugu 11 Aug 2020, 3:59 pm
పసిడి ధర మళ్లీ తగ్గింది. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.160 దిగొచ్చింది. దీంతో ధర రూ.39,190కు క్షీణించింది. అంతర్జాతీయంగా బలమైన ట్రెండ్ ఉన్నా కూడా దేశీ జువెలర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు కారణమని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
Samayam Telugu today 22ct 24ct gold silver price in hyderabad 14th december 2019
Today Gold Rate: గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం ధర.. వెండి ఝలక్!


వెండి జిగేల్

అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.180 పడిపోయింది. దీంతో ధర రూ.35,910కు తగ్గింది. ఇకపోతే బంగారం ధర తగ్గితే.. వెండి ధర మాత్రం పెరిగింది. కేజీ వెండి ధర రూ.50 పైకి కదిలింది. దీంతో వెండి ధర రూ.46,700కు చేరింది.

Also Read: టాప్ 10 పోర్న్ స్టార్స్ వీరే.. ఎంత సంపాదించారో తెలిస్తే షాకే!

దేశ రాజధానిలోనూ ఇదే పరిస్థితి

ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర పరిస్థితి ఇలానే ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.200 తగ్గుదలతో రూ.37,850కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.200 తగ్గింది. దీంతో ధర రూ.36,650కు క్షీణించింది. పసిడి తగ్గితే వెండి ధర మాత్రం పెరిగింది. ధర కేజీకి రూ.50 పెరుగుదలతో రూ.46,700కు చేరింది.

గ్లోబల్ మార్కెట్‌లో..

ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. ఔన్స్‌కు 0.54 శాతం పెరుగుదలతో 1,480.20 డాలర్లకు చేరింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 0.30 శాతం పెరుగుదలతో 17.00 డాలర్లకు ఎగసింది.

Also Read: స్మార్ట్‌ఫోన్ యూజర్లకు SBI స్ట్రాంగ్ వార్నింగ్.. అలా చేయొద్దంటూ హెచ్చరిక.. లేదంటే..

ఫెడ్ జోష్

అంతర్జాతీయ ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఇప్పుడు అమెరికా ఫెడరల్ రిజర్వు మీటింగ్‌పైనే దృష్టి కేంద్రీకరించారు. ఫెడ్ రెండు రోజుల మీటింగ్ అనంతరం రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్న ప్రకటించింది. దీంతో పసిడిపై కొంత మేర సానుకూల ప్రభావం పడింది. అందుకే ధర పైకి కదిలింది. ఇప్పుడు ఫెడ్ రేటు 1.5 శాతం నుంచి 1.75 శాతం మధ్యలో ఉంది.

19 శాతం ర్యాలీ

మరోవైపు దేశీ మార్కెట్‌లో బంగారం ధర ఈ ఏడాది దాదాపు 19 శాతం పరుగులు పెట్టింది. బంగారంపై దిగుమతి సుంకాల పెంపు, అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పరుగులు పెట్టడం వంటి పలు అంశాలు ఇందుకు ప్రధాన కారణం.

Also Read: Aadhaar కార్డు పోయిందా? ఆధార్ సెంటర్‌కు వెళ్లకుండానే ఇలా కొత్త కార్డ్ పొందండి!

పసిడి ధరపై వీటి ప్రభావం

బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.