యాప్నగరం

Today Gold Rate: షాక్.. ఒక్క రోజులోనే భారీగా పెరిగిన బంగారం ధర.. వెండి మాత్రం..

పసిడి ధర షాకిచ్చింది. హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ఏకంగా రూ.310 పెరిగింది. దీంతో బంగారం ధర రూ.39,500కు చేరింది. గత కొన్ని రోజులుగా తగ్గతూ వస్తున్న బంగారం ధర ఒక్క రోజులోనే రూ.300 పైగా పెరగడం గమనార్హం.

Samayam Telugu 16 Dec 2019, 7:19 am
పసిడి ధర షాకిచ్చింది. హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ఏకంగా రూ.310 పెరిగింది. దీంతో బంగారం ధర రూ.39,500కు చేరింది. గత కొన్ని రోజులుగా తగ్గతూ వస్తున్న బంగారం ధర ఒక్క రోజులోనే రూ.300 పైగా పెరగడం గమనార్హం.
Samayam Telugu today 22ct 24ct gold silver price in hyderabad 16th december 2019
Today Gold Rate: షాక్.. ఒక్క రోజులోనే భారీగా పెరిగిన బంగారం ధర.. వెండి మాత్రం..


కారణమిదే

అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ ఉన్నా కూడా దేశీ జువెలర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం బంగారం ధరపై సానుకూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.

Also Read: SBI బంపరాఫర్.. క్రెడిట్ కార్డు తీసుకుంటే రూ.7,000 మీ సొంతం.. ఆఫర్ ఒక్కరోజే!

వెండి మాత్రం..

అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర పరుగులు పెట్టింది. 10 గ్రాములకు 22 క్యారెట్ల బంగారం ధర రూ.310 పెరుగుదలతో రూ.36,220కు చేరింది. ఇక బంగారం ధర పెరిగితే.. వెండి ధర మాత్రం అక్కడే స్థిరంగా ఉంది. కేజీ వెండి ధర రూ.46,700 వద్దనే కొనసాగుతోంది.

గ్లోబల్ మార్కెట్‌లో..

ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. ఔన్స్‌కు 0.18 శాతం తగ్గుదలతో 1,478.45 డాలర్లకు క్షీణించింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 0.23 శాతం తగ్గుదలతో 16.97 డాలర్లకు దిగొచ్చింది.

ఆరేళ్ల గరిష్టానికి

ఇకపోతే గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర సెప్టెంబర్ నెలల్లో ఏకంగా ఆరేళ్ల గరిష్ట స్థాయి (ఔన్స్‌కు 1,550 డాలర్లకు) చేరిన విషయం తెలిసిందే. అమెరికా, చైనా మధ్య నెలకొన్ని వాణిజ్య ఉద్రిక్తతలు ఇందుకు కారణం. అయితే అప్పటితో పోలిస్తే ఇప్పుడు బంగారం ధర కింది స్థాయిల్లోనే కదలాడుతోంది.

నెల గరిష్టానికి పసిడి

బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్‌లో గురువారం రోజున నెల గరిష్ట స్థాయికి తాకింది. అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై నెలకొన్ని అస్థిర పరిస్థితులు ఇందుకు ప్రధాన కారణం. బంగారం ధర ఔన్స్‌కు 1490 డాలర్లకు ఎగసింది. ఇది పసిడికి నెల గరిష్ట స్థాయి.

20 శాతం ర్యాలీ

మరోవైపు దేశీ మార్కెట్‌లో బంగారం ధర ఈ ఏడాది దాదాపు 20 శాతం పరుగులు పెట్టింది. బంగారంపై దిగుమతి సుంకాల పెంపు, అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పరుగులు పెట్టడం వంటి పలు అంశాలు ఇందుకు ప్రధాన కారణం.

పసిడి ధరపై వీటి ప్రభావం

బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

అమెరికా, చైనా డీల్

అమెరికా, చైనా మధ్య నడుస్తున్న వాణిజ్య ఉద్రిక్తతలకు బ్రేకులు పడ్డాయి. ఇరు దేశాల మధ్య తొలి విడత ఒప్పందం కుదిరింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరపై ప్రతికూల ప్రభావం పడింది. ఇకపోతే అదేసమయంలో అమెరికా ఫెడరల్ రిజర్వు కీలక ఫెడ్ రేటును యథాతథంగా కొనసాగించిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.