యాప్నగరం

Today Gold Rate: షాకిచ్చిన బంగారం ధర.. వెండి పైపైకి.. లేటెస్ట్ రేట్లు ఇవే!

బంగారం కొందామని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు బ్యాడ్ న్యూస్. నిన్న తగ్గిన బంగారం ధర ఈ రోజు పైకి కదిలింది. పెళ్లిళ్ల సీజన్‌లో పసిడి ధర పెరగడం ప్రతికూల అంశమని చెప్పుకోవచ్చు. బంగారం బాటలోనే వెండి ధర కూడా నడిచింది. వెండి కూడా జిగేల్‌మంది.

Samayam Telugu 22 Jan 2020, 6:00 am
బంగారం కొందామని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు బ్యాడ్ న్యూస్. నిన్న తగ్గిన బంగారం ధర ఈ రోజు పైకి కదిలింది. పెళ్లిళ్ల సీజన్‌లో పసిడి ధర పెరగడం ప్రతికూల అంశమని చెప్పుకోవచ్చు. బంగారం బాటలోనే వెండి ధర కూడా నడిచింది. వెండి కూడా జిగేల్‌మంది.
Samayam Telugu today 22ct 24ct gold silver price in hyderabad 22nd january 2020
Today Gold Rate: షాకిచ్చిన బంగారం ధర.. వెండి పైపైకి.. లేటెస్ట్ రేట్లు ఇవే!


కారణమిదే..

అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర తగ్గినప్పటికీ దేశీ మార్కెట్‌లో జువెలర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో బంగారం ధరపై సానుకూల ప్రభావం పడింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి నష్టపోవడం కూడా బంగారం ధర పెరుగుదలకు దోహదపడిందని చెప్పుకోవచ్చు.

Also Read: శుభవార్త.. దిగొచ్చిన బంగారం ధర.. వెండి మాత్రం..

రూ.160 పైకి

హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర బుధవారం పెరిగింది. రూ.160 పైకి కదిలింది. దీంతో బంగారం ధర రూ.41,670 నుంచి రూ.41,830కు చేరింది.

Also Read: Jio యూజర్లకు గుడ్ న్యూస్.. కొత్త సర్వీసులు అందుబాటులోకి? ఇక గూగుల్ పే, పేటీఎం, ఫోన్‌పేకు చుక్కలే!

22 క్యారెట్ల బంగారం ఇలా

అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.160 పెరుగుదలతో రూ.38,200 నుంచి రూ.38,360కు ఎగసింది.
Also Read: డెబిట్/ క్రెడిట్ కార్డ్ యూజర్లకు అలర్ట్.. ఇలా చేయకపోతే మీ కార్డుల పనిచేయవు!

వెండిదీ ఇదే దారి

బంగారం ధర పెరిగితే కేజీ వెండి ధర కూడా పైకి కదిలింది. పసిడి బాటలోనే పయనించింది. కేజీ వెండి రూ.100 పెరుగుదలతో రూ.49,600కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు కారణం. ఇకపోతే విజయవాడ, విశాఖపట్నంలో కూడా పసిడి, వెండి ధరలు ఇలానే ఉన్నాయి.

Also Read: నెలకు కేవలం రూ.5,000తో చేతికి ఏకంగా రూ.కోటి.. ఈ కేంద్ర ప్రభుత్వ స్కీమ్‌తో ఎన్నో బెనిఫిట్స్!

అంతర్జాతీయంగా కిందకు

గ్లోబల్ మార్కెట్‌లో పసిడి స్వల్పంగా తగ్గింది. బంగారం ధర ఔన్స్‌కు 0.09 శాతం తగ్గుదలతో 1556.65 డాలర్లకు క్షీణించింది. వెండి ధర ఔన్స్‌కు 0.15 శాతం క్షీణతతో 17.75 డాలర్లకు తగ్గింది.

Also Read: Axis Bank పర్సనల్ లోన్.. రూ.50 వేల నుంచి రూ.15 లక్షల వరకు రుణం.. ఆన్‌లైన్‌లో ఇలా అప్లై చేసుకోండి!

ఢిల్లీ మార్కెట్‌లో ఇలా..

ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 పైకి కదిలింది. దీంతో ధర రూ.39,100 నుంచి రూ.39,200కు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.100 పెరుగుదలతో రూ.40,300 నుంచి రూ.40,400కు ఎగసింది. ఇక కేజీ వెండి ధర రూ.100 పెరిగింది. రూ.49,600కు చేరింది.

Also Read: బైక్/ స్కూటర్ ఉందా? కచ్చితంగా తీసుకోవాల్సిన ఇన్సూరెన్స్ పాలసీలు ఇవే.. లేదంటే..

గతేడాది పసిడి మెరుపులు

దేశీ మార్కెట్‌లో బంగారం ధర 2019లో ఏకంగా 25 శాతానికి పైగా పరుగులు పెట్టింది. బంగారంపై దిగుమతి సుంకాల పెంపు, అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పరుగులు పెట్టడం వంటి పలు అంశాలు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

Also Read: 2020లో మీ డబ్బు ఇక్కడ పెడితే అదిరిపోయే రాబడి..!

మరింత పెరుగుతుందా?

రానున్న కాలంలో పసిడి రేటు మరింత పెరిగే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు ఇందుకు దోహదపడతాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దేశీయంగా కూడా అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడితే.. ఆ అంశం కూడా పసిడి మెరుపులకు కారణంగా నిలవొచ్చని తెలిపారు. బంగారం ధర రానున్న కాలంలో రూ.45,000కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

Also Read: ఉద్యోగులకు మోదీ వరాలు! బడ్జెట్ 2020లో పాంచ్ పటాకా?

బంగారం ధరపై వీటి ప్రభావం

బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.