Today 22ct 24ct Gold Silver Price In Hyderabad 22nd January 2020
Today Gold Rate: షాకిచ్చిన బంగారం ధర.. వెండి పైపైకి.. లేటెస్ట్ రేట్లు ఇవే!
బంగారం కొందామని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు బ్యాడ్ న్యూస్. నిన్న తగ్గిన బంగారం ధర ఈ రోజు పైకి కదిలింది. పెళ్లిళ్ల సీజన్లో పసిడి ధర పెరగడం ప్రతికూల అంశమని చెప్పుకోవచ్చు. బంగారం బాటలోనే వెండి ధర కూడా నడిచింది. వెండి కూడా జిగేల్మంది.
Samayam Telugu22 Jan 2020, 6:00 am
బంగారం కొందామని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు బ్యాడ్ న్యూస్. నిన్న తగ్గిన బంగారం ధర ఈ రోజు పైకి కదిలింది. పెళ్లిళ్ల సీజన్లో పసిడి ధర పెరగడం ప్రతికూల అంశమని చెప్పుకోవచ్చు. బంగారం బాటలోనే వెండి ధర కూడా నడిచింది. వెండి కూడా జిగేల్మంది.
కారణమిదే..
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర తగ్గినప్పటికీ దేశీ మార్కెట్లో జువెలర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో బంగారం ధరపై సానుకూల ప్రభావం పడింది. అమెరికా డాలర్తో పోలిస్తే ఇండియన్ రూపాయి నష్టపోవడం కూడా బంగారం ధర పెరుగుదలకు దోహదపడిందని చెప్పుకోవచ్చు.
బంగారం ధర పెరిగితే కేజీ వెండి ధర కూడా పైకి కదిలింది. పసిడి బాటలోనే పయనించింది. కేజీ వెండి రూ.100 పెరుగుదలతో రూ.49,600కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు కారణం. ఇకపోతే విజయవాడ, విశాఖపట్నంలో కూడా పసిడి, వెండి ధరలు ఇలానే ఉన్నాయి.
గ్లోబల్ మార్కెట్లో పసిడి స్వల్పంగా తగ్గింది. బంగారం ధర ఔన్స్కు 0.09 శాతం తగ్గుదలతో 1556.65 డాలర్లకు క్షీణించింది. వెండి ధర ఔన్స్కు 0.15 శాతం క్షీణతతో 17.75 డాలర్లకు తగ్గింది.
ఢిల్లీ మార్కెట్లో కూడా బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 పైకి కదిలింది. దీంతో ధర రూ.39,100 నుంచి రూ.39,200కు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.100 పెరుగుదలతో రూ.40,300 నుంచి రూ.40,400కు ఎగసింది. ఇక కేజీ వెండి ధర రూ.100 పెరిగింది. రూ.49,600కు చేరింది.
దేశీ మార్కెట్లో బంగారం ధర 2019లో ఏకంగా 25 శాతానికి పైగా పరుగులు పెట్టింది. బంగారంపై దిగుమతి సుంకాల పెంపు, అమెరికా డాలర్తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర పరుగులు పెట్టడం వంటి పలు అంశాలు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.
రానున్న కాలంలో పసిడి రేటు మరింత పెరిగే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు ఇందుకు దోహదపడతాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దేశీయంగా కూడా అమెరికా డాలర్తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడితే.. ఆ అంశం కూడా పసిడి మెరుపులకు కారణంగా నిలవొచ్చని తెలిపారు. బంగారం ధర రానున్న కాలంలో రూ.45,000కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.