యాప్నగరం

Today Gold Rate: ఆల్‌టైమ్ గరిష్టానికి బంగారం.. రూ.2,000కు పైగా పెరిగిన ధర..!

పసడి ధర ధగధగలాడుతోంది. బంగారం ధర మళ్లీ జిగేల్‌మంది. ఈ రోజు కూడా పైపైకి కదిలింది. అప్‌ట్రెండ్‌లోనే కొనసాగింది. భారీగా ర్యాలీ చేస్తూ కొండెక్కి కూర్కొంది. దీంతో ఇప్పుడు బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. పసిడి ప్రేమికులకు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. బంగారం ధర భగభగమంటూ మెరిసిపోతుంటే.. వెండి ధర కూడా ఇదే దారిలో పరుగులు పెట్టింది.

Samayam Telugu 11 Aug 2020, 11:52 am
పసడి ధర ధగధగలాడుతోంది. బంగారం ధర మళ్లీ జిగేల్‌మంది. ఈ రోజు కూడా పైపైకి కదిలింది. అప్‌ట్రెండ్‌లోనే కొనసాగింది. భారీగా ర్యాలీ చేస్తూ కొండెక్కి కూర్కొంది. దీంతో ఇప్పుడు బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. పసిడి ప్రేమికులకు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. బంగారం ధర భగభగమంటూ మెరిసిపోతుంటే.. వెండి ధర కూడా ఇదే దారిలో పరుగులు పెట్టింది.
Samayam Telugu today 22ct 24ct gold silver price in hyderabad 25th february 2020
Today Gold Rate: ఆల్‌టైమ్ గరిష్టానికి బంగారం.. రూ.2,000కు పైగా పెరిగిన ధర..!



today gold rate timesofindia

రూపాయి విలవిల.. బంగారం పరుగు..

పసిడి ధర పెరుగుదలకు కరోనా వైరస్‌ ముఖ్య కారణం. ఇది ఇతర దేశాలకు కూడా వ్యాప్తి చెందుతుండటంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం గట్టి పడొచ్చనే ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో సురక్షిత ఇన్వెస్ట్‌మెంట్ సాధనంగా భావించే బంగారానికి డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో పసిడి ధర గ్లోబల్ మార్కెట్‌లో ర్యాలీ చేస్తోంది. దీంతో భారత్‌లో కూడా పసిడి పరుగులు పెడుతోంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడటం కూడా బంగారానికి కలిసొచ్చింది.


Also Read: రూ.5,000 నుంచి రూ.5 లక్షల వరకు రుణం.. ఇంట్లో నుంచే ఇలా అప్లై చేసుకోండి.. మీకు 5 ఆప్షన్లు!

రూ.270 పైకి

హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం బంగారం భారీగా పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.270 పెరుగదలతో రూ.44,430 నుంచి రూ.44,700కు చేరింది. బంగారం ధర రూ.45 వేల మార్క్‌కు ఇంకొంచెం దూరంలోనే ఉంది.


Also Read: 15 బ్యాంకుల్లో Home Loan వడ్డీ రేట్లు ఇలా.. ఎందులో తక్కువో తెలుసుకోండి!

22 క్యారెట్ల బంగారం ఇలా..

అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా ర్యాలీ చేసింది. ఇది కూడా రూ.270 పెరిగింది. దీంతో ధర రూ.40,730 నుంచి రూ.41,000కు చేరింది. బంగారం ధర పెరుగుతూ రావడం ఇది వరుసగా ఆరో రోజు కావడం గమనార్హం. ఈ కాలంలో పసిడి ధర రూ.2 వేలకు పైగా పెరిగింది.


Also Read: Loan క్లోజైన తర్వాత కూడా మీరు కచ్చితంగా చేయాల్సిన 5 పనులు ఇవే.. లేదంటే..

వెండి మెరుపులు

బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడుస్తోంది. వెండి ధర రూ.500 పరుగులు పెట్టింది. కేజీ వెండి ధర రూ.51,000 నుంచి రూ.51,500కు ఎగసింది. అంటే కేజీ వెండి ధర అర లక్షను దాటేసిందన్నమాట. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.


Also Read: కొత్త రూల్స్.. పాన్ కార్డు, పెట్రోల్ నుంచి ఇన్‌కమ్ ట్యాక్స్ వరకు మారుతున్న 5 అంశాలివే!

ఏడేళ్ల గరిష్టానికి..

అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర 7 ఏళ్ల గరిష్ట చేరింది. పసిడి ధర ఔన్స్‌కు 1.74 శాతం పెరుగుదలతో 1678.4 డాలర్లకు చేరింది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.98 శాతం పెరుగుదలతో 18.71 డాలర్లకు చేరింది.


Also Read:SBI ఖాతాదారులకు హెచ్చరిక.. వెంటనే ఈ పని చేయండి.. లేదంటే మీ అకౌంట్ క్లోజ్!

రూ.45,000కు పసడి?

బంగారం ధర రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశముందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా వైరస్ సహా పలు అంతర్జాతీయ పరిస్థితులు పసిడి పరుగుకు దోహదపడతాయని తెలిపారు. దేశీయంగా కూడా అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీన పడితే.. ఆ అంశం కూడా పసిడి మెరుపులకు కారణంగా నిలవొచ్చని పేర్కొన్నారు. బంగారం ధర రానున్న కాలంలో రూ.45,000 మార్క్‌కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని తెలిపారు.


Also Read: లోన్, క్రెడిట్ కార్డ్ తీసుకోవడానికి ముందు ఈ పని చేస్తే.. 5 అదిరిపోయే లాభాలు!

విశాఖ, విజయవాడ, ఢిల్లీ మార్కెట్లలో ధరలు

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా పసిడి, వెండి ధరల పరిస్థితి కూడా ఇలానే ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.270 పెరుగుదలతో 10 గ్రాములకు రూ.41,000కు చేరింది. వెండి ధర రూ.51,500కు పరుగులు పెట్టింది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ మార్కెట్‌లో పసిడి ధర రూ.240 పైకి కదిలింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.41,850కు చేరింది.


Also Read: LIC పాలసీ అదిరింది.. రోజుకు రూ.130తో చేతికి ఏకంగా రూ.25 లక్షలు.. పూర్తి వివరాలు!

7 శాతం పరుగు..

గతేడాది ఏకంగా 25 శాతం మేర పరుగులు పెట్టిన పుత్తడి.. కొత్త ఏడాదిలోనూ దూకుడు కనబరుస్తోంది. బంగారం ధర 2020 ఆరంభం నుంచే పరుగులు పెడుతూ వస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర ఈ ఏడాది ఇప్పటి దాకా ఏకంగా 7 శాతం మేర పెరిగింది. దేశీ మార్కెట్‌లోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. వెండి ధర కూడా వెలిగిపోతోంది. దేశీ మార్కెట్‌లో డిమాండ్ పెరుగుదల సహా అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడటంతో బంగారం ధర పైపైకి కదులుతోందని నిపుణులు పేర్కొంటున్నారు.


Also Read: ఆంధ్రా బ్యాంక్‌లో Personal Loan తీసుకోవాలంటే ఏ ఏ అర్హతలు ఉండాలి? పూర్తి వివరాలు!

బంగారం ధరపై వీటి ప్రభావం

పసిడి ధర ఎప్పుడూ పెరుగుతూనే ఉండదు. అలాగే ఎల్లప్పుడూ తగ్గుతూ కూడా రాదు. బంగారం ధర పరిస్థితులకు అనుగుణంగా తగ్గుతూ పెరుగుతూ వస్తుంది. అలాగే కొన్ని సందర్భాల్లో స్థిరంగా కూడా ఉండొచ్చు. బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.