Today 22ct 24ct Gold Silver Price In Hyderabad 27th February 2020
Gold Price: గుడ్ న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం ధర.. వెండి వెలవెల..!
పసిడి వెలవెలబోతోంది. దాదాపు వారం రోజులుగా పరుగులు పెడుతూ వచ్చిన బంగారం ధర ఇప్పుడు నేలచూపు చూస్తోంది. ర్యాలీకి బ్రేకులు పడ్డాయి. బంగారం ధర వరుసగా రెండో రోజు కూడా దిగొచ్చింది. దీంతో ఇప్పుడు బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి కొంత ఊరట కలిగిందని చెప్పుకోవచ్చు. బంగారం ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది.
Samayam Telugu11 Aug 2020, 11:45 am
పసిడి వెలవెలబోతోంది. దాదాపు వారం రోజులుగా పరుగులు పెడుతూ వచ్చిన బంగారం ధర ఇప్పుడు నేలచూపు చూస్తోంది. ర్యాలీకి బ్రేకులు పడ్డాయి. బంగారం ధర వరుసగా రెండో రోజు కూడా దిగొచ్చింది. దీంతో ఇప్పుడు బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి కొంత ఊరట కలిగిందని చెప్పుకోవచ్చు. బంగారం ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది.
gold rate
ఎందుకు తగ్గిందంటే?
బంగారం ధర తగ్గడానికి పలు అంశాలు దోహదపడ్డాయి. బంగారం ధర ఇటీవల కాలంలో భారీగా పెరుగుతూ రావడంతో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. దీంతో కూడా బంగారం ధరపై ప్రతికూల ప్రభావం పడింది. ఇకపోతే అమెరికా డాలర్తో పోలిస్తే ఇండియన్ రూపాయి రికవరీ చెందటం కూడా పసిడి తగ్గుదలకు దోహదపడింది.
బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. వెండి ధర పతనమైంది. రూ.200 పడిపోయింది. దీంతో కేజీ వెండి ధర రూ.50,000 నుంచి రూ.49,800కు దిగొచ్చింది. అంటే కేజీ వెండి ధర రూ.అర లక్ష దిగువకు వచ్చేసింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.
అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం ధర పెరిగింది. పసిడి ధర ఔన్స్కు 0.10 శాతం పెరుగుదలతో 1646.05 డాలర్లకు ఎగసింది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. వెండి ధర ఔన్స్కు 0.22 శాతం పెరుగుదలతో 17.87 డాలర్లకు చేరింది.
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా పసిడి, వెండి ధరల పరిస్థితి కూడా ఇలానే ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.360 తగ్గుదలతో 10 గ్రాములకు రూ.40,610కు క్షీణించింది. వెండి ధర రూ.49,800కు దిగొచ్చింది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ మార్కెట్లో పసిడి రూ.400 పడిపోయింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.41,450కు తగ్గింది.
గతేడాది ఏకంగా 25 శాతం మేర పరుగులు పెట్టిన పుత్తడి.. కొత్త ఏడాదిలోనూ దూకుడు కనబరుస్తోంది. బంగారం ధర 2020 ఆరంభం నుంచే పరుగులు పెడుతూ వస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ఈ ఏడాది ఇప్పటి దాకా ఏకంగా 7 శాతం మేర పెరిగింది. దేశీ మార్కెట్లోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. వెండి ధర కూడా వెలిగిపోతోంది. దేశీ మార్కెట్లో డిమాండ్ పెరుగుదల సహా అమెరికా డాలర్తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడటంతో బంగారం ధర పైపైకి కదులుతోందని నిపుణులు పేర్కొంటున్నారు.
పసిడి ధర ఎప్పుడూ పెరుగుతూనే ఉండదు. అలాగే ఎల్లప్పుడూ తగ్గుతూ కూడా రాదు. బంగారం ధర పరిస్థితులకు అనుగుణంగా తగ్గుతూ పెరుగుతూ వస్తుంది. అలాగే కొన్ని సందర్భాల్లో స్థిరంగా కూడా ఉండొచ్చు. బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.