యాప్నగరం

Today Gold Rate: అక్షయ తృతీయనాడు తగ్గిన బంగారం ధర.. ఎంతంటే?

బంగారం ధరలు తగ్గడంతో ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.32670 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.32500 వద్ద కొనసాగుతోంది.

Samayam Telugu 8 May 2019, 9:50 am
అక్షయ తృతీయనాడు దేశవ్యాప్తంగా బంగారం దుకాణాలు సందడిగా మారాయి. ఈ పర్వదినాన బంగారం కొంటే శుభం కలుగుతుందనే నమ్మకంతో కొనుగోలుదారులు వెల్లువెత్తడంతో నగల దుకాణాలు కిటకిటలాడాయి. మరోవైపు గత రెండు రోజులుగా పెరిగిన పసిడి ధరలు మంగళవారం(మే 7) తగ్గుముఖం పట్టడంతో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. ధరలు స్థిరంగా ఉండటం వల్ల గతేడాదితో పోలిస్తే, ఈసారి విక్రయాలు 25 శాతం అధికంగా జరిగాయని విక్రేతలు అంచనా వేస్తున్నారు.
Samayam Telugu gold


దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.50 తగ్గి రూ.33,720 నుంచి రూ.32670కి చేరింది. మరోవైపు వెండి కూడా బంగారాన్నే అనుసరించింది. కిలో వెండి ధర రూ.10 తగ్గి.. రూ.38,130 నుంచి రూ.38,120కి చేరింది. న్యూయార్క్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1282.2 డాలర్లు ఉండగా.. ఔన్స్ వెండి ధర 14.92 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

బంగారం ధరలు తగ్గడంతో ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.32670 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.32500 వద్ద కొనసాగుతోంది. సార్వత్రిక పసిడి పథకంలో 8 గ్రాములు బంగారం ధర రూ.26,400 వద్దే స్థిరంగా నిలిచింది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలను పరిశీలిస్తే మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.32,920 వద్ద.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.30,220 వద్ద కొనసాగుతున్నాయి. విజయవాడలోనూ ఇవే ధరలు ఉన్నాయి. కిలో వెండి ధర రూ.39,600గా ఉంది.

మార్కెట్లో కిలో వెండి ధర రూ.38,120 వద్ద కొనసాగుతోంది. ఇక వారంతపు ఆధారిత డెలీవరి వెండి ధర కిలోపై రూ.44 పెరిగి రూ.37,334 వద్ద కొనసాగుతోంది. 100 వెండి నాణేల కొనుగోలు ధర రూ.79,000 వద్ద, అమ్మకం ధర రూ.80,000 వద్ద ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.