యాప్నగరం

Gold Price: బంగారం ధర పరుగు.. వెండి ఝలక్!

పసిడి ప్రేమికులకు ఝలక్. బంగారం ధర భారీగా పెరిగింది. ఒకేసారి పరుగులు పెట్టింది. బంగారం బాటలోనే వెండి ధర కూడా నడిచింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా ఇదే ట్రెండ్ నడుస్తోంది.

Samayam Telugu 11 Aug 2020, 10:46 am

ప్రధానాంశాలు:

  • పసిడి ధర పరుగు
  • వెండిదీ ఇదే దారి
  • గ్లోబల్ మార్కెట్‌లోనూ బంగారం పైకి
  • 1,490 డాలర్ల వద్ద కదలిక

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu gold rate
బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు బ్యా్డ్ న్యూస్. నిన్న భారీగా తగ్గిన బంగారం ధర ఈ రోజు మాత్రం పరుగులు పెట్టింది. జిగేల్‌మంటూ దూసుకెళ్లింది. దీంతో బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ప్రతికూల అంశమని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరుగుదల సహా దేశీ మార్కెట్‌లో జువెలర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో బంగారం ధర పరుగులు పెట్టిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం బంగారం ధర భారీగా పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా రూ.750 పెరుగుదలతో రూ.42,670కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా ర్యాలీ చేసింది. 10 గ్రాముల బంగారం ధర రూ.750 పెరుగుదలతో రూ.39,090కు ఎగసింది.

Also Read: undefined

పసిడి ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. మళ్లీ రూ.40 వేల మార్క్ పైకి చేరింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.510 పెరిగింది. దీంతో వెండి ధర రూ.40,500కు పరుగులు పెట్టింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

Also Read: undefined

ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. 1500 డాలర్ల దిగువున కదలాడుతోంది. పసిడి ధర ఔన్స్‌కు 0.36 శాతం తగ్గుదలతో 1472.90 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే.. వెండి ధర మాత్రం వేరే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 3.21 శాతం పెరుగుదలతో 12.15 డాలర్లకు ఎగసింది.

Also Read: undefined

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కూడా పసిడి ధర పరుగులు పెట్టింది. బంగారం ధర ఏకంగా రూ.750 పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.750 పెరుగుదలతో రూ.39,900కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.750 పెరుగుదలతో రూ.41,100కు ఎగసింది. ఇక కేజీ వెండి ధర రూ.510 పెరుగుదలతో రూ.40,500కు చేరింది.

ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.