యాప్నగరం

Gold Rate: బంగారం ప్రియులకు భారీ షాక్... ఆల్ టైం రికార్డ్‌కు ధర!

ఏపీ తెలంగాణలో బంగారం ప్రియులకు షాక్ తగిలింది. బంగారం ధర విశాఖ. విజయవాడ, హైదరాబాద్‌ళో రూ.58వేలు దాటింది. దీంతో బంగారం కొనాాలంటేనే భయపడే పరిస్థితి.

Samayam Telugu 7 Aug 2020, 4:31 pm
బంగారం, వెండి ధరలు రోజు రోజుకీ పెరిగి పైపైకి పోతున్నాయి. రికార్డు దిశగా దూసుకుపోతున్నాయి. పసిడి పరుగులు తీస్తుంటే.. వెండిది కూడా అదే దారి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.55350గా ఉంది. వాణిజ్య రాజధాని ముంబైలో అయితే.. రూ. 54800గా ఉంది. గత వారం రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 58320 గా ఉంది. అదే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ. 53,510. విశాఖ విజయవాడలో కూడా ఇవే ధరలు ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 500 రూపాయలు పెరిగింది. దీంతో 53,510 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 500 రూపాయలు పెరిగింది. దీంతో 58 వేల రూపాయల రికార్డ్ మార్కును దాటి 58,320 రూపాయల వద్ద నిలిచింది.
Samayam Telugu బంగారం ధర
gold price hike

Read More: గోల్డ్ లోన్ తీసుకునేవారికి గుడ్ న్యూస్.. ఆర్‌బీఐ కీలక నిర్ణయం
వెండి ధరలు ఇక్కడ కూడా గురువారం నాటి ధరల కంటే భారీగా పెరిగాయి. ఈరోజు 2000 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 73వేల రూపాయల గరిష్ట రికార్డు ధర వద్ద వెండి నిలిచింది. వెండి ధరలు చూస్తే కిలో పై రూ.2000 మేర పెరిగి రూ.73,500కి చేరింది. ఆగష్టు 1న పది గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లకు గాను రూ. 51,780, 24 క్యారెట్లకు రూ. 56,490 ఉన్నది. వారంలో ధరల పెరుగుదల చూసి బంగారం ప్రియులు షాక్ తింటున్నారు.

కరోనా నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి కారణంగా బంగారం పెరుగుదలకు కారణంగా విశ్లేషకులు బావిస్తున్నారు. డాలర్‌ బలహీనపడటం, మదుపరులు బులియన్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడానికి మొగ్గు చూపడంతో బంగారం, వెండి ధరలకు ఆల్‌టైమ్‌ రికార్డు నమోదు చేస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.