యాప్నగరం

బంగారం ప్రియులకు భారీ షాక్.. రూ.60వేేల దిశగా గోల్డ్

పసిడి ధరలు ఏమాత్రం తగ్గడం లేదు. రోజురోజుకు బంగారం ధర పైపైకి పోతుంది. రూ. 60వేలకు దగ్గరలో గోల్డ్ ధరలు చేరడంతో బంగారం ప్రియులు షాక్‌కు గురవుతున్నారు.

Samayam Telugu 14 Sep 2020, 10:13 am
బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. వరుసగా 16వ సెషన్ అయిన శుక్రవారం కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరియగాయి. న్యూఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం శుక్రవారం అతి స్వల్పంగా పెరిగి రూ.57005 వద్ద ముగిసింది. ఇక హైదరాబాద్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంారం ధర రూ. 59130గా ఉంది. చెన్నై, కోయంబత్తూర్, మధురై, విజయవాడ, భువనేశ్వర్, విశాఖపట్నంలో కూడా 10 గ్రాముల బంగారం ధర రూ.59130గా ఉంది. రూ. 60వేలు దిశగా బంగారం పరుగులు తీస్తోంది.
Samayam Telugu gold news et markets


ఇక వెండి ధరలు కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. శుక్రవారం కేజీ వెండీ రూ. 77,840కు చేరింది. రూ 80వేల దిశగా వెండి పరుగులు తీస్తోంది. బంగారం, వెండి ధరలు రెండు జీవిత కాల గరిష్ట స్థాయిలో ఉన్నాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ వెల్లడించింది. వరుసగా 16వ రోు బంగారం ధరలు పెరిగాయని సీనియర్ ఎనలిస్టులు చెబుతున్నారు.
Read More: పాత వెహికల్ ఇచ్చి కొత్తది పట్టుకెళ్లండి.. వారికి అదిరిపోయే ఆఫర్
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ విషయానికి వస్తే.. ఔన్స్ బంగారం 2061 డాలర్లుగా ఉంది. ఔన్స్ వెండి 28.36 డాలర్లుగా ఉంది. మరో రోజు కూడా బంగారం వెండి ధరలు ఆల్ టైం హైకి చేరుకున్నాయని కమోడిటీస్ రీసెర్చ్ నిపుణులు అంటున్నారు. వెండిధరలు కూడా మరింత పెరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.